Monday 11 February 2013

News Clippings about Model Schools

Sakshi 17/7/13



13/7/13 Namaste Telangana



Sakshi Nalgonda








Eenadu 14/6/13




Eenadu 13/6/13

Sakshi 13/6/13


Eenadu 13/6/13

Sakshi 13/6/13

Eenadu 13/6/13
 ఆదర్శ ఇంటర్‌ ప్రవేశానికి గడువు పెంపు
ఆదిలాబాద్‌: కుంటాలలోని ఆదర్శ ఇంటర్‌ మొదటి సంవత్సరానికి సంబంధించి గడువును జూన్ 15 వరకు పెంచినట్లు ఎమ్మెల్యే వేణుగోపాలచారి జూన్ 11న‌ తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు జూన్ 11న‌ హైదరాబాద్‌లో సంబంధిత మంత్రి, ప్రధాన కార్యాలయఉన్నతాధికారులతో మాట్లాడి గడుపుపెంపునకు అనుమతి తీసుకున్నట్లు చెప్పారు.

Andhra Jyothi 11/06/13

Eenadu 11/6/13

'ఆదర్శ' ఉపాధ్యాయులకు ఆప్షన్లు 11 నుంచి

హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ పోస్టులకు ఎంపికైనవారు జూన్ 11 నుంచి తాము కోరుకునే ప్రాంతాలకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇవ్వాలని ఆదర్శ పాఠశాలల సంచాలకుడు సత్యనారాయణరెడ్డి జూన్ 10న తెలిపారు. రాతపరీక్ష, మౌఖిక పరీక్షల్లో నెగ్గిన వారి జాబితాలను ఇంతకముందే ప్రకటించారు. వీరికి నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది. అభ్యర్థులు కోరుకునే ప్రాంతాల్లో నియమించే అవకాశం ఇవ్వడానికి ఆన్‌లైన్ ఆప్షన్ సౌకర్యం కల్పించారు. మంగళ, బుధవారాల్లో వారు ఇచ్చిన ఆప్షన్లను బట్టి నియామక పత్రాలు జారీచేస్తారు. ఆప్షన్లు ఇవ్వాల్సిన వెబ్‌సైట్: www.apms.cgg.gov.in

Sakshi 11/06/13


Eenadu
Eenadu

Eenadu


Eenadu


Sakashi


Namasthe Telangana Adilabad Dt. 7/5/13




Sakshi 06/5/13



Sakshi 28/4/13


Namaste telangana 28/4/13

15 నుంచి మోడల్ స్కూల్‌పోస్టుల భర్తీ:
మోడల్ స్కూల్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి మే 15 నుంచి 18 వరకు జోనల్ హెడ్‌క్వార్టర్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకులు వీ ఉషారాణి తెలిపారు. జోన్ల వారీగా మెరిట్ జాబితాలను http://apms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.



Sri V. Gurumurthy, formerly Sr. Lecturer, DIET and now working as Principal, CTE, Warangal is promoted to the post of District Educational Officer / Dy. Director of School Education, under Category 1 of Class II of APES.

2. Consequent on promotion Sri V. Gurumurthy is posted as Dy. Director (A), Model
Schools, O/o C&DSE, Hyderabad in the existing vacancy.
                                                                 Source: GO issued by Rajeshwar Tiwari dated 25/4/13

Andhra Bhoomi 25/4/13

ప్రిన్సిపాల్ పోస్టులకు సర్ట్ఫికెట్ల పరిశీలన
మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపాల్ పోస్టులకు మే 2వ తేదీ నుండి రెండు రోజుల పాటు సర్ట్ఫికెట్ల పరిశీలన చేయనున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ వి. ఉషారాణి తెలిపారు. కుదించిన అర్హుల జాబితాను ఎపిఎంఎస్ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆమె వెల్లడించారు. సర్ట్ఫికేట్ల పరిశీలన అబిడ్స్‌లోని మహబూబియాలోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్‌లో జరుగుతుందని వివరించారు.

Eenadu 25/4/13

ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=582102&Categoryid=14&subcatid=0#latest
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=582102&Categoryid=14&subcatid=0#latest


Sakshi 25/4/13



RMSA 24/4/13


 Eenadu Guntur 24/4/13



Eenadu 23/4/13

 

Sakshi 23/4/13

 

Andhrajyothi 23/4/13



Sakshi 21/4/13

 Namaste Teangana 21/4/13




  Eenadu 21/4/13




 Andhra Jyothi  Kadapa 20/04/13

 కార్పొరేట్  పాఠశాలలకు దీటుగా  మోడల్ స్కూల్స్

జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాల లను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది. జిల్లాకు 29 పాఠశాలలు మంజూరు కాగా తొలివిడతగా 10 పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. స్థల సకరణలో జాప్యంతో మూలాన 8 పాఠశాలలకు పనులు ప్రారంభిం చారు. మిగతా రెండింటికి స్థల సేకరణలో కొంత ఆలస్యమైనప్పటికి పాఠశాల భవన నిర్మాణం పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రభు త్వం మాత్రం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. ఉపాధ్యాయ నియామక పక్రియ ప్రారంభించాలని పక్రియ మార్గదర్శ కాలతో మాధ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యున్నత సౌక ర్యాలతో ప్రభుత్వం మోడల్ స్కూల్స్ నిర్మాణం చేయాలని యోచించింది. 2009-10 విద్యా సంవత్సరంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా జిల్లాకు 29 మోడల్ పాఠ శాలలు మంజూరు చేసింది. అయిదె కరాల స్థలంలో ఒక్కో పాఠ శాల నిర్మా ణానికి రూ.3 కోట్లు ప్రభు త్వం ఖర్చు చేయనుంది. విశాలమైన మైదానం, అతిపెద్ద గ్రంథాలయం, ప్రయోగ శాల, కంప్యూటర్ ల్యాబ్, ప్రధానో పాధ్యాయుడికి ప్రత్యేక గది, క్రీడా వస్తువుల ప్రత్యేక విభాగం ఇలా సౌకర్యాల పరంగా ప్రైవేటు పాఠశాల లకు తీసిపోనిరీతిలో మోడల్ స్కూల్స్ తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆశయం.

జిల్లాకు మొదటి విడతగా 10 పాఠ శాలల నిర్మాణానికి నిధులు మం జూరు చేసింది. అయితే స్థలానికి మాత్రం నిధులు ఇవ్వకుండా దాతల నుంచి స్థలం సేకరించుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో స్థల సేకరణలో జాప్యం జరిగిందని చెప్పా లి. ప్రస్తుతం స్థలాల ధరలు చుక్కలను అంటుతున్న తరుణంలో అయిదెకరా ల స్థలం మండల కేంద్రాల్లో ఉచితంగా లభించడమనేది కష్టంగా మారింది. అయినా 8 పాఠశాలలకు ఎలాగోలా స్థలం సేకరించి పనులు ప్రారంభించారు. మరో రెండింటికి కొంత ఆలస్యమైనా చివరకు స్థలం సేకరించారు గాని పనులు మాత్రం ఇంకా ప్రారంభించలేదు.

అయితే గత ఏడాది పాఠశాల భవనాలు పూర్తి కానప్పటికి భవనాలకు సమీపంలో గల ఉన్నత పాఠశాలల్లో మోడల్ స్కూల్స్ ప్రారం భించాలని ప్రభుత్వం యోచించినా మళ్లీ ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ సంవ త్స రం మాత్రం పది మోడల్ స్కూల్స్ ప్రా రంభించాలని ప్రభుత్వం దృఢ నిశ్చ యంతో ఉంది. పాఠశాల భవనాలు లేని రెండింటిని అద్దె భవనాల్లో అయి నా ప్రారంభించాలని చూస్తున్నా రు. మంజూరైన 29 పాఠశాలల వివరాలుఅట్లూరు, బి.కోడూరు, బి.మఠం, చక్రాయపేట, చాపాడు, చిన్నమండెం, చిట్వేల్, దువ్వూరు, గాలివీడు, జమ్మల మడుగు, కలసపాడు, ఖాజీపేట, లక్కిరెడ్డిపల్లె, మైదుకూరు, ఓబులవారి పల్లె, పెద్ద ముడియం, పెనగలూరు, పెండ్లిమర్రి, పోరుమామిళ్ళ, పుల్లం పేట, రామాపురం, రాయచోటి, ఎస్ఎ కాశినాయన, సంబేపల్లె, టి.సుండు పల్లె, వల్లూరు, వీరబల్లి, వేంపల్లె, వేముల మండలాల్లో మంజూర య్యాయి.

ప్రారంభం కానున్న మండలాలుఖాజీపేట, వల్లూరు, రామాపురం, రాయచోటి, చిన్నమండెం, పుల్లంపేట, ఎస్ఎ.కాశినాయన, సంబేపల్లె, పెనగ లూరు, ఎల్ఆర్ పల్లి, మండలాల్లో ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.సీట్ల వివరాలు2013-14 విద్యా సంవత్సరంలో భాగంగా జిల్లాలో 10 మండలాల్లో మోడల్ స్కూల్స్ ప్రారంభం కాను న్నాయి. ఈ సంవత్సరం 6,7,8 తరగతులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రారంభం చేస్తారు. 6, 7, 8 తరగతుల్లో ప్రతి తరగతికి రెండు బ్యాచ్‌ల చొప్పున ఒక తరగతికి 80 మంది విద్యార్థులను భర్తీ చేయను న్నారు. అంటే 6, 7, 8 తరగతుల్లో మొదటి ఏడాది 240 మంది విద్యా ర్థులను భర్తీ చేసుకుంటారు. అలాగే 2014-15 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 2015-16 విద్యా సంవత్స రంలో 10వ తరగతి ప్రారంభించ నున్నారు.

ఇంటర్మీడియట్‌లో ఎంపిీసీ, బైపీసీ, ఎస్ఇసి, ఎంఈసీ గ్రూపులు ఉంటాయి. ప్రతీ గ్రూపునకు 20 మంది చొప్పున 80 మంది విద్యారు ్థలను చేర్చుకుంటారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీ య సంవత్సరం ప్రవేశ పెట్టనున్నారు.రిజర్వేషన్ వివరాలుమోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలను రిజర్వేషన్స్ ప్రకారం భర్తీ చేసుకుం టారు. మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 29 శాతం బీసీలకు, 50 శాతం ఇతర విద్యార్థులకు కేటాయించారు. బీసీ లలో బీసీ ఏ 7 శాతం, బీసీ బీ 10 శాతం, బీసీ సిీ 1 శాతం, బీసీ డీ 7 శాతం, బీసీ ఈ 4 శాతం విద్యార్థులను భర్తీ చేస్తారు.

అలాగే అన్నీ తరగతుల్లో 33.33 శాతం బాలికలకు కేటా యిస్తారు. ఇంటర్మీడియట్‌లో భర్తీకి ఇదే రిజర్వేషన్ వర్తిస్తుంది.దరఖాస్తుల వివరాలుమోడల్‌స్కూల్స్‌లో ప్రవేశాలకు సం బంధించి మండల విద్యాశాఖ కార్యా లయంలో ఉచితంగా దర ఖాస్తులు లభిస్తాయి. అయితే భర్తీ పక్రియ ప్రారంభమయినప్పుడు విద్యాశాఖ నిర్దిష్టమైన తేదీ ప్రకటించి అదే తేదీలలో దరఖాస్తులు అంద జేస్తుంది.

 Eenadu 20/4/13

 Andhra Jyothi Ananthapuram Dt 19/4/13

మొండికేసిన ఆదర్శం..!

అన్నీ ఉన్నా అంగట్లో శని అంటే ఇదేనేమో ? జిల్లాలో ఆదర్శ పాఠశాలల పరిస్థితి గందరగోళంగా మారడమే ఇందుకు నిదర్శ నంగా చెప్పవచ్చు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేద విద్యా ర్థులకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించే ఉద్దేశంతో ఆదర్శపాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. అయితే రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖమంత్రి శైలజానాథ్ జిల్లాకు చెందినవారే అయి నా అవి నిర్మాణాలకు నోచుకోలేదు. తొలివిడత ఆదర్శ పాఠశాలల ప్రారంభానికి ఇక 50 రోజులే గడువుంది.

ఈ పరిస్థితుల్లో తొలివిడత 25 పాఠశాలలకు గాను కేవలం పదింటినే ప్రారంభించే అవకాశముంది.

అనంతపురం అర్బన్,ఏప్రిల్ 19: కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేద పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించాలని ప్రవేశపెట్టిన ఆదర్శపాఠశాలలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఇందుకు సంబంధించిన ప్రధానమైన రెండు శా ఖల్లోనూ జిల్లాకు చెందిన మంత్రులే ఉన్నా.. ప్రయోజనం శూన్యమన్న వా దనలు వినవస్తున్నాయి. ముఖ్యంగా స్థల సమస్య తీర్చడానికి రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, విద్యకు సంబంధించి సమస్యలు పరిష్కరించడానికి ప్రాథమిక విద్యాశాఖమంత్రి శైలజానాథ్ ఇద్దరూ జిల్లాకు చెందినవారే. ఇద్దరు కీలక మంత్రులున్నా ఈ ఆదర్శ పాఠశాలలు మాత్రం రెండేళ్లు దాటి నా.. నిర్మాణాలకు నోచుకోకండా ఉండ టం బాధాకరం.

జిల్లాలో కొత్తచెరువు, పెనుకొండ మినహా 61 మండలాలకు ఈ పాఠశాలలు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.3.02కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో తొలి విడత కింద 25 మండలాల్లో ఆదర్శపాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించాలని నిర్ణయించారు. ఇందు లో అగళి, ఆమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కనేకల్, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, శె ట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్, యాడికి, యల్లనూరు మండలాలు ఉన్నాయి. వీటికి 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఒ క్కో పాఠశాలకు రూ.3.02కోట్ల నిధు లు విడుదల చేశారు.

ఒక్కో పాఠశాల నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఉండాలని నిబంధన పెట్టారు. ఈ స్థలం చూపించడంలో అధికార యంత్రాం గం పూర్తిగా విఫలమైంది. 25 మండలాలకు స్థలాలు చూపించారు. అయి నా భవన నిర్మాణాల విషయంలో జా ప్యం చేస్తూ వచ్చారు. పాఠశాలల ని ర్మాణాల కోసం ఆన్‌లైన్ ద్వారా టెండర్లను ఆలస్యంగా పిలిచారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. గతేడాదే ఈ పాఠశాలలు ప్రారంభించాలనుకున్నప్పటికీ... భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభమయ్యే జూన్‌లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభిస్తున్న ట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి పార్థసారధి గంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటివరకూ ఒక్కచోట కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు. అధికారులు మా త్రం నిర్మాణాలు పూర్తి చేస్తామని అం టున్నారు. గడువు 50 రోజులు మాత్ర మే ఉంది. ఈ సమయంలో భవన నిర్మాణపు పనులు పూర్తి చేస్తారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. తొలివిడతలో ప్రారంభం కావాల్సిన అమరాపురంలో స్థల సమస్య వల్ల నేటికీ భవన నిర్మాణమే మొదలు కాలేదు. ఈ మండలంలో జూన్‌లో ఆదర్శ పాఠశాల ప్రారంభం లేనట్లేనని తెలుస్తోంది. రెండోవిడత కింద అనంతపురం, ఆత్మకూరు, బొమ్మనహాళ్, బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, చిలమత్తూరు, గాండ్లపెంట, గుదిబం డ, గుమ్మగట్ట, గుంతకల్లు, కదిరి, కం బదూరు, కూడేరు, కుందుర్పి, మడకశిర, ముదిగుబ్బ, నల్లమాడ, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, పరి గి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, రొ ద్దం, సోమందేపల్లి, తాడిమర్రి, తలుపుల మండలాలకు నిధులు కేటాయించారు. ఇందుకు కూడా 2011-12 విద్యా సంవత్సరంలో ఒక్కో పాఠశాలకు రూ.3.02 కోట్ల చొప్పున భవన నిర్మాణాలకు మంజూరయ్యాయి. ఇక్క డ కూడా అనేక మండలాల్లో స్థల స మస్య నెలకొంది. దాదాపు 10 మండలాల్లో స్థలం లేక యంత్రాంగం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇందు లో బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, డి.హిరేహాళ్, గోరంట్ల, నార్పల, శింగనమల మండలాల్లో స్థలం లేక పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇక బెలుగుప్ప, లే పాక్షి, రొళ్ల, తనకల్లు మండలాల్లో సెం టు స్థలం కూడా లేదని రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగానికి చెప్పి చేతులెత్తేసారు. దీంతో రెండో విడత పాఠశాలలు కూడా పర్తయ్యే అవకాశాలు కనపించడం లేదు.

విద్యార్థుల ఎంపికలోనూ..

2013-14 విద్యా సంవత్సరం అం టే జూన్ నుంచి ఆదర్శ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను ఈ పాఠశాలలకు ఎలా ఎంపిక చేస్తారనేదానిపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. ఆ యా మండలాలకు చెందిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటారా? జిల్లా వ్యాప్తంగా తీసుకుంటారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. విద్యార్థు ల అడ్మిషన్ల ప్రక్రియ కూడా లాటరీ విధానంలో తీసుకుంటారా..? పోటీ పరీక్ష పెట్టి ప్రతిభ ఆధారంగా తీసుకుంటారా..? అనే సందిగ్ధత నెలకొంది. లాటరీ విధానంపై విద్యార్థులను ఎం పిక చేస్తే ఆదర్శ పాఠశాలల విలువ తగ్గిపోతుందన్న భావన వ్యక్తమవుతోం ది. అసలే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజ ల్లో చులకన భావన ఉంది. అలాంటపుడు ఆదర్శ పాఠశాలలను పటిష్టంగా అమలుపరిచి నాణ్యమైన విద్యను అం దించినపుడే సార్థకత ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడం ఈ అయోమయానికి తెరతీసినట్లు చెప్పవచ్చు.

మోడల్ డీఎస్సీ భర్తీకి గ్రీన్ సిగ్నల్...

ఆదర్శ పాఠశాలలకు ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమం అభ్యర్థులతో టీచర్ పోస్టులను నియమించేందుకు డీఎస్సీని నిర్వహించారు. ఏడాదిన్నర దాటినా... నియామకాలపై నీలినీడలు కమ్ముకుంటూ వచ్చాయి. చివరకు వ చ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో మోడల్ డీఎస్సీ నియామకాలకు ఆ మోదం వేసింది. ఈనెల 30 నుంచి నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీం తో ఆ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

 

 Andhra Jyothi Guntur Dt 19/4/13

నరసరావుపేట,ఏప్రిల్ 18: వెనుకబడిన ప్రాంతా ల్లో మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 14 మోడల్ పాఠశాలలను ప్రారంభిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. మే నెలాఖరు కల్లా పూర్తయ్యేలా రూ 42.28 కోట్ల వ్యయంతో భవన నిర్మాణాలు చేపట్టారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన నిర్వహించే ఈ పాఠశాలలకు 5,760సీట్లు మంజూరు చేశారు.

రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభయాన్ పథకం కింద ఈ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం 6, 7, 8, 11 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఒక్కో తరగతికి 80 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలకు ధీటుగా సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యా బోధన జరగనుంది. సైన్స్, మ్యాథ్స్ సబ్జక్టులపై శిక్షణ కు అధిక ప్రాధాన్యం కల్పిస్తారు. డ్రా యింగ్, మ్యూజిక్, కంప్యూటర్ విద్య కూ డా అందించనున్నారు. ఈ స్కూల్స్‌లో హాస్టల్ వసతి కల్పిస్తారు. కేంద్రీయ విద్యాలయాల తరహాలో మోడల్ స్కూల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ప్రకటించింది.

ప్రస్తుతం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే నేటి వరకు ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయలేదు. లాటరీ పద్ధతిలో ప్రవేశాలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అడ్మిషన్లపై స్పష్టత లేకపోవటంతో ఆయా ప్రాంతాల్లోని తల్లిదండ్రు లు అయోమయంలో వున్నారు.

పల్నాడుకు ప్రాధాన్యం

మోడల్ స్కూల్స్ ఏర్పాటులో పల్నాడు ప్రాంతానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. నరసరావుపేట డివిజన్‌లోనే 13 పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. నకరికల్లు మండలం దేచవరం, రొంపిచర్ల మండలంలో విప్పర్లరెడ్డిపాలెం వద్ద మోడల్ పాఠశాలల నిర్మా ణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దుర్గి, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల, దాచేపల్లి, గురజాల, నాదెండ్ల, ఈపూరు, వినుకొండ, నూజెండ్ల, క్రో సూరు మండలాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. మే నెలాఖరు కల్లా భవన నిర్మాణాలు పూర్తయ్యేలా పనులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్స్‌లో అడ్మిషన్ల సంఖ్య తదుపరి విద్యా సంవత్సరానికి 5,760 నుంచి 8వేలకు పెరుగుతుంది. ఒక్కో భవనాన్ని రూ. 3.02 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో నిర్మిస్తున్నారు.

టీపీఆర్ రేషియో ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయి. ఒక్కో తరగతి గదికి 40 మంది విద్యార్థులను కేటాయిస్తారు. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు జరుగుతున్నాయి. మండల యూనిట్‌గా ఈ స్కూల్స్‌లో అడ్మిషన్‌లు జరగవచ్చని పలువురు ఎంఈవోలు చెబుతున్నారు. అయితే అడ్మిషన్‌లకు సంబందించి తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.


Andhra Jyothi 19/4/13


When ever any candidate files a case, generally the court takes in into primary consideration and asks the concerned to file a counter. The same thing might have happened here now. The court hasnot decided their eligibility. It asked the Govt to file an explanation so that the judgement may come later.


         Coming to the recruitment, if the Govt wishes to recruit, it can request the permission of the court to continue the recruitment procedure including TM candidates. But in the appointment orders, the point like "all the appointments are subjected to the final judgement of Hon'ble Supreme Court of India" may be included. Because the interest of more than one lakh students awaiting to join these schools is to be considered. But anyway I doubt a little bit about the delay in the recruitment for few more days.


         Again the judgement is not going to affect many aspirants because very few candidates' result has been put in WITH HOLD (Court Case). In many subjects the number is only a single digit. As telugu medium TGT applicants were not allowed for the exam, its not going to affect their result.


Flash!!!!

      Supreme Court of India ordered RMSA to release the results of Telugu Medium candidates who applied and attended the Model schools' exam. The court also asked the Govt of AP to submit an explanation stating the reasons for making TM students Ineligible for these posts in two weeks.
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=582102&Categoryid=14&subcatid=0#latest

తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీం ఊరట: Namaste Telangana
ఢిల్లీ: మోడల్ స్కూల్ తెలుగుమీడియం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగుమీడియం అభ్యర్థుల ఫలితాలు ప్రకటించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులకు తెలుగు మీడియం అభ్యర్థులు అనర్హులంటూ ఇచ్చిన జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట: Sakhi
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=582102&Categoryid=14&subcatid=0#latestv
 ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మోడల్‌ స్కూళ్లు : తెలుగుమీడియం అభ్యర్థులకు ఊరట Surya
న్యూఢిల్లీ : మోడల్‌ స్కూళ్లలో తెలుగు మీడియం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వెంటనే తెలుగు మీడియం ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలుగుమీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో 2వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 
ఢిల్లీ: మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు అనర్హులో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=582102&Categoryid=14&subcatid=0#latest

17/4/13 Namaste Telangana



16/4/13 Sakshi




16/4/13 Sakshi



16/4/13  Andhra Jyothi



16/4/13  Eenadu

ఆదర్శ మెరిట్ జాబితాకు మరికొంతసమయం!

* ముందుగా టీజీటీ, పీజీటీ నియామకాలు
* ప్రిన్సిపాళ్ల పోస్టుల భర్తీచివర్లో…!
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగావచ్చే విద్యా సంవత్సరం నుంచి 355 ఆదర్శ పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఏప్రిల్ 15న నిర్ణయించింది. విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో వీటిని ప్రారంభించబోతున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల నియామకాల ప్రక్రియ ఆదిలోనే ఉంది. తొలుత ప్రిన్సిపాళ్ల పోస్టులను భర్తీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీ చర్యల్లో భాగంగా అభ్యర్థులకు మౌఖిక పరీక్షలను జరపాల్సి ఉంది. అయితే..ఈ పరీక్షలను జరిపేందుకు అవసరమైన ప్రొఫెసర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రస్తుతం వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్నందున వారి సమయం దొరకడం ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా అర్హత ధ్రువీకరణపత్రాల పరిశీలన విషయంలో తగిన జాగ్రత్తచర్యలు తీసుకోవల్సి ఉన్నందున ప్రిన్సిపాళ్ల పోస్టుల భర్తీకి మరికొంత సమయం అనివార్యమని భావిస్తున్నారు. ఈలోగా..టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్టును వెల్లడించాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు నెలాఖరు వరకు సమయం తీసుకునే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే..వారం తరువాత ఈ జాబితాను వెల్లడించే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. 355 పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించినందున పోస్టుల భర్తీ కూడా అదేవిధంగా జరగనుంది.


14/4/13 Namaste Telangana


13/4/13 Andhra Jyothi 


 

Eenadu 12/4/13

Sakshi Anathapur 11/4/13  


 

Namaste Telangana Ranga Reddy 11/4/13

 

 

Namaste Telangana Ranga Reddy 11/4/13


 

10/4/13 Eenadu Guntur Dt


 

Mahaboob nagar Sakshi edition Dt 9 April 2013

In Phase-1 Out of 7 schools 6 are completed remaining 1 will get ready in June.. News paper is misguiding us by publishing about  construction of Phase 2 schools whose work is in Delay.

 

ప్రజాశక్తి- Warangal లింగాల ఘణపురం   Sat, 6 Apr 2013

నత్తనడకన ఆదర్శ స్కూల్‌ భవన నిర్మాణ పనులు 

పాఠశాల నిర్మాణానికి 3 కోట్ల 25లక్షల రూపాయలు కేటాయించారు. లింగాల ఘణపురం గ్రామంలో రెండు చోట్ల ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒకసారి శంకుస్థాపన చేయగా మళ్లీ ఆయనే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరి రెండవ సారి ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గత సంవత్సరం పనులు ప్రారంభించినప్పటికీ నత్త నడకన సాగుతున్నాయి. ఆ నిర్మాణ పనులలో కూడా నాణ్యత పాటించకుండా మట్టి కలిసిన ఇసుకతో పనులు చేస్తున్నా అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదు. ఒకే కాంట్రాక్టరుకు జిల్లావ్యాప్తంగా 26 ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు అప్పగించడంతో సబ్‌ కాంట్రాక్టర్లను ఏర్పాటుచేసి పనులు చేయడంతో నాణ్యత లేకుండా నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం ఆదర్శ పాఠశాలలను కొనసాగించేందుకు విద్యార్థుల నుండి మండలంలోని 18 గ్రామాల నుండి 260 దరఖాస్తులను స్వీకరించారు. ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో చేసుకున్న దరఖాస్తులను విద్యాధికారులు రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వచ్చే విద్యా సంవత్సరానికైనా ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

 



Eenadu 6/4/13


 Eenadu 6/4/13



Eenadu 5/4/13



 Andhra Jyothi 5/4/13


Namaste Telangana 5/4/13


Vartha




Eenadu Prakasam Dt 3/4/13




Sakshi Nizamabad 1/4/13



Vartha March 21st 2013 Editorial 

కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న విద్యారంగ సంస్కరణల్లో అంతర్భాగంగా దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ తరహాలో ఆరువేల మోడల్‌ స్కూళ్లను 2011-12 సంవత్సరంలో మంజూరు చేసింది. ఒక్కోక బ్లాక్‌లో ఒక్కో స్కూల్‌ని ఏర్పాటు చేయాలని ప్రతిభ, సామర్థ్యం, గుణాత్మకత ప్రమాణాల విషయంలో ఆదర్శంగా ఉండాలని సూచించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 737 స్కూళ్లు విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో నెలకొల్పాలని నిర్ణయించి తొలిదశలో వెనుకబడిన మండలాల్లో 355 మోడల్‌ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రెండవ విడతలో 2012-13 సంవత్సరంలో మరో 234 మోడల్‌ స్కూళ్లను మంజూరు చేసింది. 148 స్కూళ్లను ఇంకా మంజూరు చేయాల్సిఉంది. మొత్తం ఆరువేల స్కూళ్లలో 3,500 స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రెండవ విడతలో 2012-13 సంవత్సరంలో మరో 234 మోడల్‌ స్కూళ్లను మంజూరు చేసింది. 148 స్కూళ్లను ఇంకా మంజూరు చేయాల్సి ఉంది. మొత్తం ఆరువేల మోడల్‌ స్కూళ్లలో 3,500 స్కూళ్లను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అయ్యే మొత్తం ఖర్చులో 11వ పంచవర్షప్రణాళిక కాలం వరకు కేంద్రం 75శాతం రాష్ట్రాం 25శాతం భరిస్తుంది. తరువాత 12వ పంచవర్ష ప్రణాళికా కాలం అనగా 2013 సంవత్సరం నుండి కేంద్ర, రాష్ట్రాలు చెరి సగం 50:50 ఖర్చును భరిస్తుంది. మిగతా 2,500 స్కూళ్లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి)తో నిర్వహించాలని పేర్కొంది. ఒక్కో మోడల్‌స్కూలుకి వ్యవస్థాపక నిర్వహణ ఖర్చు క్రింద 3.77 కోట్లు మంజూరు చేస్తుంది.
విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లోనే మోడల్‌స్కూళ్లను నెలకొల్పడంచేత ఇంటర్‌స్థాయి వరకు విద్యనభ్యసించడానికి అన్నిహంగులతో కూడిన విద్యాసంస్థగా వీటిని రూపొందించాలి. వీటికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగిస్తూ కేంద్రీయ పాఠశాలస్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవస్థ నిర్వహణ ఉండాలి. ఆదర్శ పాఠశాల వ్యవస్థకు ప్రత్యేత నిబంధనలు సర్వీసు నియమావళిని ఉండే విధంగా చూడాలి. ప్రస్తుతం ఉన్న పాఠశాలలో అన్ని వసతులున్న వాటిని మోడల్‌ స్కూళ్లుగా కన్వర్ట్‌ చేయాలన్న విధానము సబబుకాదు మోడల్‌స్కూళ్లు క్రొత్తగానే నిర్మాణం చేపట్టాలి. వీటికి స్థలకేటాయింపులు, భవననిర్మాణాలలో ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు ఉండే విధంగా చూడాలి.
విద్యార్ధుల సంరక్షణకు తగినవిధమైన విధంగా ఉండాలి. పాఠశాల అడ్మిషన్‌ ప్రక్రియలో గ్రామీణప్రాంతాల వారీగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఉన్నతస్థాయి ప్రవేశ పరీక్షలకు కోచింగ్‌ మరియు తర్ఫీదు ఇవ్వాలి. పాఠశాలకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులకు బస్‌ సౌకర్యం కల్పించాలి. మోడల్‌ స్కూళ్లలో బాలికల హాస్టళ్లను కూడా ప్రాంగణంలో ఏర్పాటు చేయబడుతుంది. ఒక్కో హాస్టల్‌లో వందమంది బాలికలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్ణయించారు. కాలానుగుణంగా బాలికల విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్న తరుణంలో వీటిలో బాలికల అందరికి హాస్టళ్ల వసతులు కల్పించాలి. మోడల్‌ స్కూళ్లను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మండల కేంద్రంలో విశాల స్థల సమీకరణ లేకున్నా మండల కేంద్రానికి దగ్గర ప్రాంతములో వీటిని ఏర్పాటు చేయాలి.
మోడల్‌స్కూళ్లలో అడ్మిషన్లు ప్రక్రియలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బిసిలకు 29శాతం, బాలికలకు 33.3శాతం కేటాయించారు. వీటిలో ఎలాంటి ఆదాయపరిమితులను విధించలేదు. ఆరవతరగతి నుండి 12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయాల కరికులమ్‌  సిలబస్‌ అమలుచేయాలి. ఆంగ్లమాధ్యమ పాఠశాలగానే గుర్తింపు నివ్వాలి. ఒక తరగతికి రెండు సెక్షన్లు ఉండాలి. తెలుగుమీడియంలో ఒక సెక్షన్లు ఆంగ్లమీడియంలో ఒక సెక్షను ఉండాలి. అడ్మిషన్లు పిల్లలకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం ద్వారా జరపాలి. లాటరీ విధానం చెప్పరాదు. తరగతిగది విద్యార్ధుల నిష్పత్తి 1:30గా ఉండాలి. కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా వీటిని రూపొందించాలి. బడుగు, బలహీనవర్గాల పిల్లలకు వీటిలో అధిక ప్రాధాన్యత కల్పించాలి. కంప్యూటర్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయం, సాంకేతిక పరిజ్ఞాన సదుపాయం ఉండాలి. కో కరికులమ్‌ అంశాలకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలి. ఆరోగ్యవిద్య, గ్రంథాలయం, క్షేత్రపర్యటనలు, ఆటలు, ఆటస్థలాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అన్ని విషయల్లోనూ కేంద్రీయ విద్యాలయాలు ప్రమాణాలను పాటించాలి. పాఠశాల పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో మానిటరింగ్‌ కమిటీలు ఉండాలి. రిటైర్డు ఉపాధ్యాయుల సర్వీసులను ఈ మానిటరింగ్‌ కమిటిలో వినియోగించుకోవాలి.పెరుగుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి విడతలో నిర్మాణాలు చేపట్టిన 355 ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లను ఇంకా అసంపూర్తిగా చేపట్టడం జరుగుచున్నది. వాటి నిర్మాణానికి జాతీయ గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థలకు అప్పగించాలి. సకాలంలో, క్వాలిటీ ఉన్న విధంగా భవనాలు కొత్తపంధాలో చేపట్టాలి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాటిని ఆరంభించాలి. ఆదర్శ పాఠశాలలో నియామకాలుకు అవసరమైన 7,100 పోస్టుల భర్తీ చేయాలి. ఈ పోస్టుల రాతపరీక్షల ఫలితాలు వెల్లడై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియామకాలు జరగలేదు. మే నాటికి నియామకాలు భర్తీ చేయాలి. నాన్‌ టీచింగ్‌ పోస్టులన్నింటిని భర్తీచేయాలి.
ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం వచ్చే విద్య సంవత్సరం నుండి మోడల్‌స్కూళ్ళలో 6-8వ తరగతి వరకు, కాలేజీ స్థాయిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపిసి, బైపిసి, సిఇసి, ఎంఇసి గ్రూపులో ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాలయా తరహాలో 6-12వ తరగతి వరకు సిబిఎస్‌ ఈ సిలబస్‌తో ఇంగ్లీషుమీడియం స్కూళ్లను ఏర్పాటు చేయాలి. మోడల్‌స్కూళ్ళలో చేరే విద్యార్థినులకు నివాసవసతిని కల్పిం చాలి. మోడల్‌ స్కూళ్ల ఏర్పొటులో విద్య, సామాజిక, ఆర్థికరంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే పూర్తిస్థాయిలో అమలు పరచాలి. అనేక రకాలుగా ప్రైవేటు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నందు వల్ల పిపిపి ద్వారా అమలుపరచేందుకు అనేక ఇబ్బందులు ఎదురుకాగలవు. నిర్మాణాత్మక వాతావరణం ఉండాలి.
చదువ్ఞతోపాటు, ఎక్స్‌ట్రాకలికులం యాక్టివిటీస్‌కు పెద్దపీట వేయాలి. డాన్సు, స్పోర్ట్స్‌, మ్యూజిక్‌వంటి ఎక్స్‌ట్రాకరికులం వంటివాటి లోపాలు పెయింటింగ్‌, గ్రాఫిక్‌డిజైన్‌, శిల్పశాస్త్రం, కుట్టుపనులపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఏ తరగతికి అను గుణంగా పిల్లలు యూనిఫారమ్‌ ధరించడం ఉండాలి. ఆర్గానిగ్‌ ఫామింగ్‌ ద్వారా వ్యవసాయ విధానము వృత్తి విద్య కోర్సులు, కార్పెంటరీ, భవనాల డిజైనింగ్‌, ఆటోమొబైల్‌ రిపేరింగ్‌ మోడల్‌స్కూల్స్‌లో ఏర్పాటు చేయాలి. ప్రతిమోడల్‌ స్కూళ్లులో అన్ని వసతులు కలిగి ఉండాలి. దానికి అనుగుణమైన విద్యారంగ సదుపాయాలను ఉన్నతస్థాయిలో కలిగి ఉండాలి. మోడల్‌స్కూళ్లు సర్వీసు నిబంధనలు విడుదల చేయాలి.
మోడల్‌ స్కూళ్లలో స్నేహపూర్వక, అంగీకారయోగ్యంగా పాఠశాల ప్రధాన ప్రవేశప్రాంతం, విద్యార్ధులందరూ కలిసి గడిపే ప్రదేశాలు ఆడిటోరియం, లేబరేటరీ, లైబ్రరీ, ప్లేగ్రౌండ్‌, విశాలమైన తరగతిగదులు, ఉపాధ్యాయులకు పాఠశాల, తరగతి గదిలో మంచి వసతుల కల్పన,స్టాఫ్‌రూమ్‌ అనువైన విధంగా, ఎంతో ప్రభావితంగా బోధనావ్యవహారాలను ఉపాధ్యాయులు అమలు చేయడానికి వీలుగా ఉండాలి. ప్రతితరగతికి డ్యూయల్‌ డస్క్‌ల ఏర్పాటు చేయాలి. మోడల్‌స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీస్థలాల్లో కూరగాయతోటలు సాగుచేయాలి. ఈ స్కూళ్ల నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ప్రాస్టిక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చేపడుతున్నది. భవన నిర్మాణంలో మంచి క్వాలిటీ ఉండే విధంగా చూడాలి.
మోడల్‌స్కూళ్ల ఏర్పాటు ఆశయం మంచిదే అందరికీ సమానమైన, న్యాయమైన విద్యను అందించాలి. కాని పిపిపి విధానంలో విద్యారంగం బాధ్యత నుండి ప్రభుత్వాలు క్రమంగా తప్పుకొంటూ నిధులిచ్చి ప్రైవేటు నిర్వహణకు ప్రోత్సహించడం మంచి విధానం కాదు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌తో మోడల్‌స్కూల్స్‌ ఏర్పాటు విరమించుకోవాలి. బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్‌ టైంస్కేల్‌తోనే నియమించాలి. అవుట్‌సోర్సింగ్‌ విధానమును అమలు చేయరాదు. మోడల్‌ స్కూళ్ల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలి. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలను బలోపేతం చేపట్టాలి. సక్సెస్‌ పథకం ద్వారా నడుస్తున్న హైస్కూళ్లను పటిష్ఠ పరచాలి. మోడల్‌ స్కూళ్లను అన్ని రంగాలలో ఉత్తమ విద్యాసంస్థగా రూపొందించి ప్రైవేటు, కార్పోరేటు, టెక్నో, కాన్సెప్ట్‌ స్కూళ్లలో ఉన్న వసతులు, మౌలిక సదు  పాయాలు, వనరులు కల్పించి అన్నివిధాల ఉత్తమపరమైన నాణ్యతగత అంశాలకు ప్రాధాన్యతనిస్తూ మోడల్‌ స్కూళ్లను మేటి స్కూళ్లగా రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అన్ని విధాల పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, విద్యాపరంగా విద్యార్థులకు చదువ్ఞకోవడానికి కావలసిన పరికరాలను ఉచితంగా అందించి గ్రామీణ ప్రాంతాలవారికి అధిక ప్రాధాన్యతనివ్వాలి.
                                                                                                               రచయిత
                                                                                                     విశ్రాంత ఉపాధ్యాయులు

 

 

Sakshi Prakasam dt 29/3/13

 


 

 

Sakshi Adilabad 29/3/13

 





 

 

Andhra Jyothi Nellore 28/3/13


Surya- 28/3/13

మోడల్‌ స్కూల్‌ డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తాం- మంత్రి పార్థసారధి

ఏప్రిల్‌లోగా మోడల్‌ స్కూల్‌ డీఎస్సీ నియామకాలను పూర్తి చేస్తామని మంత్రి పార్థసారధి తెలిపారు. ఎంపికైన వారికి మే నెలలో శిక్షణ ఇస్తామని ఆయన  వెల్లడించారు

 

  Surya 28/3/13

మోడల్‌ స్కూళ్ల టీచర్ల భర్తీకి మోక్షం

|   
   


హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: రాష్ట్రీయ మాధ్య మిక విద్యా శాఖ (ఆర్‌ఎంఎస్‌ఎ) పరిధిలో ప్రవేశ పెట్టిన 355 మండలాల్లో ఏర్పాటు చేయనున్న మోడల్‌ స్కూళ్లలో నిలిచి పోయిన టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ ప్రారంభించడా నికి మోడల్‌ స్కూల్‌ సోసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తోం ది. వచ్చే నెల 29వ తేదీ నుంచి మోడల్‌ స్కూళ్ల పరిధిలో ఉన్నటువంటి 7,100 టీచర్‌ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ల వెరి ఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ తర్వాత రిక్రూట్‌మెంట్‌ నిబంధనల ప్రకారం వారం పది రోజులలో నియా మక ప్రక్రియ ముగించాలని భావిస్తున్నట్లు అధికా రులు పేర్కొన్నారు. ఇందులో పిజిటి పోస్టులు 4,615 పోస్టులు, టిజిటిలో 2,130 పోస్టులతో పా టు ప్రిన్సిపల్‌ పోస్టులు 355 ఉన్నాయి.

వాస్తవానికి గత ఏడాదిలోనే ప్రారంభం కావాల్సిన 355 మోడల్‌ స్కూ ళ్లు పక్కా భవనాల నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల ఈ ఏడాదికి వాయిదా పడింది. అయితే ప్రస్తుతం వీటిలో 340 వరకు పక్కా భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 12 భవనాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. మిగిలిన వాటిలో తాత్కాలికంగా అడ్మిషన్లు నిర్వహించాల ని మోడల్‌ స్కూల్‌ సొసైటీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ 2013-2014 విద్యా సంవత్సరం నుం చి ప్రారంభం కాబోతున్న మోడల్‌ స్కూళ్లలో తొలుత 6, 7, 8, తరగతులతో పాటు 11వ తరగతిలో కూడా అడ్మిషన్లు నిర్వహించడానికి సొసైటీ నిర్ణయం తీసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొనసాగుతున్న నవోదయ, కేంద్రీయ విద్యాలయాల తరహాలో మోడల్‌ స్కూళ్లు కొన సాగించాల న్న ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూ రు చేసింది. అయితే 75 శాతం కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మిగిలిన 25 శాతం నిధులు మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏదీ ఏమైనప్పటికీ ప్రైవే టు స్కూళ్లకు ధీటుగా సర్కారి స్కూళ్లను అభివృద్ధి చేయ డంలో భాగంగానే మోడల్‌ స్కూళ్లను అభివృద్ధి పర చనున్నట్లు సొసైటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

News in Times of India 28/3/13

355 English Model Schools to open in Andhra Pradesh

HYDERABAD: Come June and hundreds of children in remote mandals of the state will go to schools wearing neat uniforms and study modern history and English literature as the state is all set to open 355 new model schools in an equal number of mandals by June this year.
The English medium schools will provide quality education with a special focus on girls from educationally backward areas, officials said.
The move comes at a time when the state is lagging behind the national literacy rate and experts said that opening of English medium schools shows the government’s policy shift of acknowledging poor standards of education in the districts and its attempt to improve the overall literacy standards. While the female literacy rate in the state stands at 59.74% which is 5.71% below the national female literacy rate of 65.45%, the literacy rate of men is 75.6% as against the national average of 82.1%. “In total, 7,400 teaching and non-teaching posts have been created. The aim of the model school project is to provide good education in rural areas,” said AP Model School Society additional director B Seshu Kumari.
According to school education department officials, there will be two sections with 40 seats each from classes VI to X. The Intermediate first and second year classes will have an intake of 80 students each in the MPC, Bi PC, CEC and MEC combinations.
While a 4% reservation has been made for the educationally backward Muslim communities under the BC (E) category, one seat for a Muslim girl student has been carved out of the 33.3% reservation for girl students. The first phase includes only two of the 13 minority concentration mandals, spread across seven districts in the state.
Sources from the AP Model School Society (APMSS) pointed out that while admissions were expected to begin last year, the delay was on account of problems in identifying potential school sites, short listing civil works contractors and delay in budget calculation.
“Rules say that every school has to have five acres of land attached to it. It took a long time to find such land parcels. Naturally the calculation of expenses too would take time,” said an official, who gave details but is unauthorised to speak to the media.
The unit cost of each model school will be Rs 3.02 crore with Rs 2.72 crore earmarked for construction of buildings, Rs 30 lakh for setting up a computer lab and Rs 75 lakh annually for staff salaries.
Each school will have one principal, 13 post graduate teachers and six graduate teachers and will be recruited latest by May this year so that classes can begin smoothly in June.
Further, 100-bedded girls hostels in every mandal are expected to be constructed within 16 months and schools are being planned in another 737 mandals, which have low female literacy rates.


 Andhra Jyothi Nellore 27/3/13




Sakshi Guntur (Dt) 27/3/13

 

Eenadu 27/1/13







Vartha 26/3/13


Sakshi 26/3/13


Namaste Telangana 26/3/13

 

 

Andhra Jyothi 26/3/13

 

  Andhra jyothi Karimnagar 25/3/13

 

 

 

Eenadu Main 23/3/13

 

 

  Sakshi Khammam 21/3/13


 

 

Eenadu Main 20/3/13

 

 Andhra jyothi 20/3/13

20/3/13 Sakshi

 

 

మోడల్‌స్కూళ్ల నియామకాలకు మోక్షం
         
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 355 మోడల్‌స్కూళ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో వాటిలో టీచర్ల నియామకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ విషయంలో డిప్యుటేషన్ కోటాపై సమస్య పరిష్కారం కావడంతో వచ్చే నెల మొదటివారంలో ప్రిన్సిపాళ్ల నియామకాలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో ప్రిన్సిపాళ్ల నియామకాలు, చివరి వారంలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‌టీచర్లు (టీజీటీ) చేపట్టే అవకాశముంది. మే నెలలో వారికి ఐదు వారాల పాటు శిక్షణనిచ్చి జూన్12న స్కూళ్లు తెరిచేనాటికి వారిని సిద్ధం చేయనున్నారు. మరోవైపు స్కూళ్లు ప్రారంభమయ్యేనాటికి భవననిర్మాణాలు పూర్తికాని మండలాల్లో అద్దె భవనాల్లో స్కూళ్లు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్కూళ్లలో ఆరు, ఏడు, ఎనిమిది, ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభించనున్నారు. వీటికి సంబంధించి విద్యార్థులను స్కూళ్లలో చేర్చుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
- See more at: http://sakshi.com/Main/Breakingstory.aspx?catid=563421&Categoryid=14&subcatid=0#sthash.ujQBQu8m.dpuf
మోడల్‌స్కూళ్ల నియామకాలకు మోక్షం
         
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 355 మోడల్‌స్కూళ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో వాటిలో టీచర్ల నియామకాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ విషయంలో డిప్యుటేషన్ కోటాపై సమస్య పరిష్కారం కావడంతో వచ్చే నెల మొదటివారంలో ప్రిన్సిపాళ్ల నియామకాలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో ప్రిన్సిపాళ్ల నియామకాలు, చివరి వారంలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‌టీచర్లు (టీజీటీ) చేపట్టే అవకాశముంది. మే నెలలో వారికి ఐదు వారాల పాటు శిక్షణనిచ్చి జూన్12న స్కూళ్లు తెరిచేనాటికి వారిని సిద్ధం చేయనున్నారు. మరోవైపు స్కూళ్లు ప్రారంభమయ్యేనాటికి భవననిర్మాణాలు పూర్తికాని మండలాల్లో అద్దె భవనాల్లో స్కూళ్లు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్కూళ్లలో ఆరు, ఏడు, ఎనిమిది, ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభించనున్నారు. వీటికి సంబంధించి విద్యార్థులను స్కూళ్లలో చేర్చుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
- See more at: http://sakshi.com/Main/Breakingstory.aspx?catid=563421&Categoryid=14&subcatid=0#sthash.ujQBQu8m.dpuf

  News in Sakshi

Exact Point mentioned in the speech of Finance Minister of AP on 18th March, 2013 in Assembly.

Similarly construction of 355 Model Schools is underway in Educationally Backward Blocks in Andhra Pradesh in Phase-I. Along side the model schools, 355 attached girl’s hostel buildings are under execution with support from the Central Government.

 

Eenadu Main dated 18/3/13 sent by Khaleel

 

ఆదర్శ పాఠశాలలు జూన్‌లో ప్రారంభిస్తాం
18 Mar 2013 03:40,
(18 Mar) కొడకండ్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలలను రానున్న జూన్‌నాటికి ప్రారంభిస్తామని ఆర్వీఎం రాష్ట్ర సంచాలకులు వి.ఉషారాణి తెలిపారు. ఆదివారం వరంగల్‌ జిల్లా కొడకండ్లలో నిర్మాణంలో ఉన్న ఆదర్శ పాఠశాల భవనాన్ని జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 280 పాఠశాల భవనాలు తుదిదశ నిర్మాణంలో ఉండగా, 30 పాఠశాలలు పునాదిస్థాయిలో, 35 పాఠశాలలు శ్లాబ్‌ స్థాయిలో ఉన్నట్లు వివరించారు. అద్దె భవనాల్లో అయినా ఆదర్శ పాఠశాలలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల్లో సిబ్బంది నియామక ప్రక్రియ ఏప్రిల్‌లో పూర్తవుతుందన్నారు. విద్యార్థుల ప్రవేశంరిజర్వేషన్‌ విధానంతో లాటరీ పద్ధతిన చేపట్టనున్నట్లు వివరించారు.

 

ప్రహసనంగా ఆదర్శ పాఠశాలల నిర్మాణాలు

Andhrajyothi Khammam 15/3/13

జూలూరుపాడు: గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మండలానికి ఓ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో 2010-11 లో జిల్లాలోని 33మండలాలకు రాష్ట్ర సర్కార్ ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది. వాటి నిర్మాణాలకు సంబంధించిన స్థల సేకరణ ఆయా మండలాల తహసీల్దార్లకు బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ పాఠశాలలు మంజూరై రెండేళ్లు గడిచినా ఒక్క మండలంలో కూడా పాఠశాలల నిర్మాణం పూర్తయిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కారేపల్లి, పెనుబల్లి మండలాల్లోనే నిర్మాణాలు స్లాబ్ దశకు చేరుకున్నాయి.

దీంతో రానున్న విద్యా సంవత్సరంలో ఈ రెండు మండలాల్లో మాత్రమే ఆదర్శ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. మిగతా మండలాల్లో నిర్మాణాలను పూర్తి అనుమానమే. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్థలం దొరక్క ఈ పాఠశాలలకు సంబంధించి ప్రాథమిక పనులు కూడా పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి 5ఎకరాల ప్రభుత్వభూమి అవసరం కాగా ఒక్కో పాఠశాల నిర్మాణానికి గాను రూ.3.02కోట్లను కేటాయించారు.

ఆదర్శ పాఠశాలలు మంజూరైన మండలాలివే..


జిల్లాలో పెనుబల్లి, కారేపల్లి, ఎర్రుపాలెం, కుక్కునూరు, గార్ల, చింతకాని, వేలేరుపాడు, చింతూరు, పినపాక, తిరుమలాయపాలెం, జూలూరుపాడు, వెంకటాపురం, ఏన్కూరు, గుండాల, ముదిగొండ, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, భద్రాచలం, ములకలపల్లి, కూనవరం, చంద్రుగొండ, వీఆర్‌పురం, బూర్గంపా డు, ఖమ్మం రూరల్, కామేపల్లి, కూసుమంచి, బోనకల్, బయ్యారం, కొణిజర్ల, టేకులపల్లి, ఖమ్మం అర్బన్, పాల్వంచ తదితర మండలాల్లో 33 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు అధికారులు సంకల్పించారు. వీటిలో పెనుబల్లి, కారేపల్లి మం డలాలకు మంజూరైన రెండు పాఠశాలల పనులు మాత్రమే స్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి. మిగతా 31 మండలా ల్లో ప్రభుత్వ స్థలం దొరక్కపోవడంతో నిర్మాణం మొదలు కాలేదు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వ స్థలాలను గుర్తించి అయా మండలాల తహసీల్దార్లు ఇటీవల జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్‌కు నివేదికలు అందించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పాల్వంచలో ఏర్పాటు చేయాల్సిన ఆదర్శ పాఠశాలకు నేటికీ స్థలం దొరకలేదు. వచ్చే ఏడాదికైనా పనులు ప్రారంభించి నిర్మాణాలు చేపట్టని మండలాల్లో పాఠశాలల నిర్మాణాలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు. అయితే స్థల సేకరణే జరగని నేపథ్యంలో నిర్మాణాలు ఎలా చేపడుతారో అధికారులకే తెలియాలి. ప్రస్తుతపరిస్థితిని చూస్తే వచ్చే ఏడాది కూడా నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. పలు మండలాల్లో మండల కేంద్ర సమీపంలో ప్రభుత్వభూములు లభ్యంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు మండల కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లోని గుట్టలు, కొండలపై పాఠశాలల నిర్మాణాలకు స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ గుట్టలను చదును చేసి అసలు పనులను చేపట్టడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలను నిర్మించి అధికారులు చేతులు దులుపుకుంటే తదనంతర పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలను దెబ్బతీయటానికే: ఉపాధ్యాయ సంఘాలు

గ్రామీణ పేద పిల్లలకు విద్యావసతితో కూడిన ఆదర్శ పాఠశాలలను ఏర ర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే గ్రా మాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయడానికేనని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ రూపొందించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వసతి సౌకర్యం ఉండటంతో అధిక సంఖ్యలో విద్యార్థులు ఆదర్శ పాఠశాలల వైపు సహజంగా ఆకర్షితులవుతారని, దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు సంఖ్య క్షీణించి క్రమేణా ప్ర భుత్వ పాఠశాలలను ఎత్తివేసే పరిస్థితి రావచ్చని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సౌకర్యాలు కల్పి ంచి బలోపేతం చేయాల్సిందిపోయి రా ష్ట్ర సర్కార్ వీటికి ప్రత్యామ్నాయంగా ఆ దర్శ ప్రాఠశాలలను ఏర్పాటుచేసి ప్ర భుత్వ పాఠశాలలను నిర్వీ ఃర్యం చే యడం గర్హణీయమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

Exact Point mentioned in the speech of Governor of AP on 13th March, 2013 in Assembly

To provide quality education in the educationally backward blocks, 355 model schools have been sanctioned in phase-I. Further, 355 girls hostels attached to these Model Schools have been sanctioned by the Govt. of India- Governor

 

విద్యాభివృద్ధిని వదిలేశారు : ఎస్‌ఎఫ్‌ఐ

అందరికీ విద్య అందిస్తామన్న రాష్ట్రప్రభుత్వం ఆ లక్ష్యసాధనకు ప్రణాళిక లేకుండానే గవర్నర్‌ ప్రసంగం కొనసాగిందని భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదర్శ పాఠశాలలను ప్రారంభించకుండానే వాటినే రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం హాస్యాస్పదమని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నూర్‌ మహమ్మద్‌, పగడాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. రాజీవ్‌ విద్యా దీవెన పథకానికి విధివిధానాలు లేకపోవటం ప్రశ్నార్థకంగా ఉందని వారు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయటం,ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన గురించి గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావనే లేదని తెలిపారు. ఉన్నత విద్యను నాణ్యమైన విద్యగా అందిస్తామన్న ప్రభుత్వం అది ఎలా అందిస్తారో చెప్పలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగంపట్ల చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

 

Governor about Model Schools in Assembly on 13/3/13  

 

13/3/13 Andhra Bhoomi

 

ఎన్నాళ్లీ ఎదురు చూపులు ? 


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు జరిపి సంవత్సర కాలం దాటినా ఇప్పటివరకు ప్రభుత్వం నియామక ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న వేలాదిమంది ఉపాధ్యాయ అభ్యర్థులు నిరాశకు గురవుతూ ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం వస్తుందో రాదో తెలియక గందరగోళంలో ఉండి ఇతరపోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నారు. వెనుకబడిన మండలాల్లో విద్యాభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొదటి విడతగా 355 ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 2009లో ఆదర్శ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిలో పనిచేసేందుకు అవసరమైన ఉపాధ్యాయుల కోసం ఫిబ్రవరి 2012న ప్రకటన విడుదల చేసింది. ప్రిన్సిపాల్‌ ఉద్యోగాలకు నెల జీతంగా రూ.20680 నుంచి రూ.46960 వరకు, పిజిటిలకు రూ. 16150 నుంచి రూ.42590, టిజిటిలకు రూ.14860 నుంచి 39540 రూపాయలుగా వేతనాలు నిర్ణయించారు. జీతాలు కూడా ఆకర్షనీయంగా ఉండటంతో 7వేల ఒక వంద ఉపాధ్యాయ ఖాళీల కోసం విద్యార్హతలు గల లక్షా 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మే10, 2012న పిజిటి, టిజిటి పోస్టుల కోసం పరీక్షలు నిర్వహించగా, మే11, 2012న ప్రిన్సిపాల్‌ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహించింది. జాబితాను కూడా ప్రకటించింది. ఈ ప్రక్రియ జరిగి చాలా కాలమైనప్పటికీ నియామకాలు జరుపడంలో విద్యాశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. జూన్‌ 2013లోపు ఆదర్శ పాఠశాలలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించి ఫిబ్రవరి 11, 2013న ఆదర్శపాఠశాలలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాబోయే జూన్‌లో ఎలాగైనా ఆదర్శ పాఠశాలలను తెరువాలనే ఉద్దేశ్యంతో ఆదర్శ పాఠశాలల భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. వీటితోపాటు బాలికల వసతి గృహాలను కూడా ఏర్పాటుచేసింది. ఇన్ని ఏర్పాట్లు చెెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాన్ని చేయలేకపోయింది. దీంతో ఆదర్శపాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రారంభమవుతాయా లేదా అనే అంశం సందేహంగా తయారైంది



 

 

Namaste Telangana-Nalgonda Dt 13/3/13 



 

Eenadu Main Paper 12/3/13 sent by Ravi Kumar

  Andhra jyothi adilabad 12/3/13

 

 

Namaste Telangana 11/3/13  (Informed by Nithin)


 

  Eenadu-Guntur Rural 9/3/13

 Eenadu 8/3/13

 

 

మోడల్‌ స్కూల్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి by Surya
March 7, 2013

కవాడిగూడ, మేజర్‌న్యూస్‌ : పరీక్షా రాసి మార్కులు ప్రకటించి పోస్టింగ్‌ కోసం వేచి చూస్తున్న వేలాది మంది అభ్యర్థుల ఫలితాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది సెలెక్టెడ్‌ అభ్యర్థులు నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా జరిపారు. ఆదర్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం ఇచ్చిన ‘చలో హైదరాబాద్‌’ పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడు తూ విద్యాశాఖ నిర్లక్ష్యం వలన లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ 355 మోడల్‌ స్కూల్స్‌ కోసం 7100 టీచర్స్‌, ప్రిన్సిపాల్స్‌ కోసం ఫిబ్రవరి 2012న నోటిఫికేషన్‌ జారీ చేసి, మే 2012లో పరీక్షలు నిర్వహించక సుమారు లక్షా యాభైవేల మంది అభ్య ర్థులు పాల్గొన్నారన్నారు. కాని నేటి వరకు వారి భవితవ్యం నేటికి ప్రకటించకపోగా నియామకాల ప్రక్రియను ప్రారంభిం చకపోవడంతో అభ్యర్థులంతా అయోమయంలో పడ్డారు.

పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగం వస్తుందో, రాదో తెలియక గందరగోళ పరిస్థితిలో ఉండి ఈ ఉద్యోగంపై ఆశ చంపుకోలేక ఇతర పోటీ పరీక్షలకు వెళ్ళలేక అభ్యర్థులంతా మానసికంగా కృం గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేసారు. ఈ ఉద్యోగం రాదోమో తెలిస్తే గ్రూప్‌-1, గ్రూప్‌-2, జూనియర్‌ లెక్చరర్స్‌ లాంటి ఉద్యోగాలకైనా ఫ్రిపేర్‌ అవుతామన్న ఆలోచనను కూడా వారిలో ధైర్యాన్ని ఇవ్వలేకపోతుం దని ఎటుపోలేక అభ్యర్థులంతా నడి సముద్రంలో నావలాగా తమ బతుకులను కొట్టుమిట్లాడు కుంటూ కొనసాగుతున్నా దన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే నియామకాలను చేపట్టాలని కృష్ణయ్య డిమాండ్‌ చేసారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మంచి ఉన్నత విద్యగల ప్రమా ణాలు గల ఇంగ్లీషు మీడియం విద్యను అందివ్వాలనే సదుద్దే శంతో కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కేటా యించి మోడల్‌ స్కూల్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా పాఠశాలను ఇప్పటికే ప్రారంభమయి మూడు సంవత్సరాలు గడుస్తున్నాయన్నారు. కాని మన రాష్ట్రంలోని ప్రభుత్వ నత్త నడకలో నడవడం వల్ల నేటికి ఒక పాఠశాలకు కూడా ప్రారంభానికి నోచుకోలేని, దుర్గతి దాపురించదన్నారు. ఈ పాఠశాలలు ప్రారంభించక పోవడంతో పేద వర్గాలు అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చేర్పిస్తున్నారన్నారు. మన బిల్డిం గ్‌లు ఇంకా పునాదుల స్థాయిలోనే ఉన్నాయని ముఖ్య మంత్రి ఆదేశించిన్పప్పటికీ విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. వారం రోజుల్లో ఆదర్శ పాఠశాల టీచర్ల, ప్రిన్సిపాళ్ళ సెలెక్టెడ్‌ జాబితా ప్రకటించి పోస్గింగ్స్‌ ఇవ్వకపోతే సిఏం ఇల్లును ముట్టడిస్తామని ఆర్‌. కృష్ణయ్య హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిసి నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్‌, గుజ్జకృష్ణ, ర్యాగ రమేష్‌, గూడూరు భాస్కర్‌, నీల వెంకటేశ్‌, సిహెచ్‌ మల్లేష్‌ యాదవ్‌, సి. రాజేందర్‌, కె. బాల్‌రాజ్‌, కుల్కచర్ల శ్రీనివాస్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sakshi 7/3/13

 

వారంలో ఫలితాలు రావాలి-ఆర్.కృష్ణయ్య 7/3/13

హైదరాబాద్: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన పరీక్షా ఫలతాలు వారంలోగా విడుదలజేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండు చేశారు. ఆయన బుధవారం సచివాలయంలో బీసీ నేతలతో కలిసి మాధ్యమిక విద్యాశాఖ మంత్రికి ఇదే విషయమై విజ్ఞాపన కూడా అందించారు.


5/3/2013

Namaste Telangana 5/3/2013

 

 


For the news about model schools dated 5/3/2013

 



The exact Press note Released by CM office to the media 

 http://newstelugu.net/wp-content/uploads/2013/03/Kiran-Kumar-Reddy.jpg
Hyderabad : Chief Minister N Kiran Kumar Reddy has directed the School Education department to speed up construction of Government Model schools in the State. 
Officials explained that out of the 737 schools, 355 will be completed in the I Phase of which 164 school complexes are nearing completion and 104 school complexes are going to reach finishing stage very shortly. The works at other places also will be speeded up. The total outlay for these 355 schools in the I Phase is Rs.1072.10 crores.
It may be recalled here that Government of India proposed to start 6,000 Model Schools throughout the country to provide quality education at secondary level on Kendriya Vidyalaya template during 20011-12. For each Model School, the non-recurring Grant is Rs.3.02 crores (Rs.2.72 crores for civil works and Rs.0.30 crores for furniture and equipment) and Recurring Grant of Rs.0.75 crores. The ratio of Central and State share is 75:25.
The State Government proposed to establish Model Schools in all the 737 Educationally Backward Mandals of the State and 355 Model schools were sanctioned in Phase I during 2011-12 while 234 Model schools were sanctioned in Phase II during 2012-13. Proposals for sanction of the remaining 148 Model Schools will be sent to the Centre shortly. The Phase I Model schools will start functioning from June this year with classes VI to VIII and Junior Intermediate (MPC, BPC, MEC and CEC groups) in English Medium with State syllabi and are co-educational institutions. Some 7,100 teaching posts were sanctioned for the 355 Model Schools sanctioned in Phase I. Staff recruitment work is in progress and all of them will be positioned by May 2013. Induction training to the newly recruited teaching staff will be provided.
The Government of India has also sanctioned Girls Hostels to these Schools with an intake of 100 students and the grounding of works are about to take place. For the Model schools, Guidelines for Admissions were issued by the State Government on February 11, 2013. The students, who domicile from the mandal or studied in the particular Mandal are eligible for admission in these schools and 15% seats are reserved for SCs, 6% for STs and 29% for BCs. In all, 33.3% of the total seats are reserved for girls. There is no income limit for admission but children from lower income group shall be preferred.
Construction of school complexes for the 355 Model schools has been entrusted to Andhra Pradesh Educational and Welfare Infrastructure Development Corporation.
The list of district-wise number of Model Schools and location of all the schools are:

Sl.No.

District

Phase I

Phase II

Total

1

Srikakulam

14

8

22

2

Vizianagaram

16

4

20

3

Visakhapatnam

5

20

25

4

East Godavari

2

4

6

5

Krishna

2

1

3

6

Guntur

14

5

19

7

Prakasam

11

18

29

8

Nellore

10

0

10

9

Chittoor

18

1

19

10

Kadapa

10

17

27

11

Ananthapur

25

24

49

12

Kurnool

36

7

43

13

Adilabad

14

34

48

14

Karimnagar

47

0

47

15

Warangal

30

10

40

16

Khammam

2

7

9

17

Mahabubnagar

7

40

47

18

Ranga Reddy

19

6

25

19

Medak

24

9

33

20

Nizamabad

16

14

30

21

Nalgonda

33

5

38

            Total

355

234

589


CM asks officials to speed up construction of model schools- By Chennaionline

Hyderabad, Mar 3: Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy today directed the School Education Department to speed up construction of the Government Model schools in the State. The state Government proposed to establish Model Schools in all the 737 educationally backward mandals of the State. As many as 355 Model schools were sanctioned in Phase I during 2011-12 with an outlay of Rs 1072.10 crore, while 234 model schools were sanctioned in Phase II during 2012-13.
At a review meeting here, the Officials explained that out of the 737 schools, 355 will be completed in the I Phase of which 164 school complexes are nearing completion and 104 school complexes are going to reach finishing stage very shortly, an official release here said. It may be recalled here that Government of India proposed to start 6000 Model Schools throughout the country to provide quality education at secondary level on Kendriya Vidyalaya template during 2011-12. For each Model School, the non-recurring Grant is Rs 3.02 crore (Rs 2.72 crore for civil works and Rs 0.30 crore for furniture and equipment) and Recurring Grant of Rs.0.75 crore.
The ratio of Central and State share is 75:25. Proposals for sanction of the balance 148 Model Schools will be sent to GoI shortly. The Phase I Model schools will start functioning from June 2013 with classes VI to VIII and Junior Intermediate (MPC, BPC, MEC and CEC groups) in English Medium with State syllabi and are co-educational institutions.
The release said 7,100 teaching posts were sanctioned for the 355 Model Schools sanctioned in Phase I. Staff recruitment work is in progress and all of them would be positioned by May 2013. Induction training to the newly recruited teaching staff will be provided. Government of India have also sanctioned Girls Hostels to these Schools with an intake of 100 students and the grounding of works are about to take place.
For the Model schools, Guidelines for Admissions are issued by the State Government on 11-2-2013. The students who domicile from the mandal or studied in the particular Mandal are eligible for admission in these schools. Fifteen per cent seats are reserved for SCs, six per cent seats are for STs and 29 per cent seats are reserved for BCs while 33.3 per cent of the total seats are reserved for girls. There is no income limit for admission but children from lower income group shall be preferred, the release added.
As a part of the Right to Education Act implementation, he said, intensive drive was launched to enroll all the eligible children in the schools and 98 per cent target was achieved till now. Besides, training was also being imparted to teachers to ensure quality education, he added. Tuni MLA Raja Ashok Babu presided over the function. Mr Pallamraju distributed cheques under Abhaya Hastham scheme to 26 beneficiaries on the occasion. Later, he laid foundation stone for the National Highway No 5 widening works being taken up at a cost of Rs 5.20 crore at Annavaram village.
Meanwhile, Model School Teachers Association (MSTA) has decided to organise 'Chalo Hyderabad' programme and 'Mahadharna' at indira Park in the city on February 6 demanding recruitment of vacancy teachers posts at various schools in the state. In a release, the association said State BC welfare Association President R Krishnaiah will participate as a Chief guest in dharna and appealed those who attended model school written exams across the state and waiting for the results to participate in the agitational programme .
All principals and PGT and TGT teachers working at various schools in the state will join in the agitation, the release added. However, state BC Welfare Association in its meeting today demanded that the government should fill up 4.50 lakh teachers vacancies at various schools in the state. The meeting which held under the chairmanship of Krishnaiah, also resolved to demand the government to fill up the vacancies on permanent basis instead of daily-wage, part-time and out sourcing. The retired employees, who were working still at various schools, should be terminated and its posts would be filled with new candidates, the association also demanded. IT also demanded that the government should increase the direct recruitment quota from 30 to 50 per cent.

Expedite work on model schools, says Kiran- The Hindu

Chief Minister N. Kiran Kumar Reddy has directed the officials of the School Education Department to take steps to speed up construction of government model schools.
Contemplated as part of the Central government’s scheme for construction of 6,000 model schools across the country, works on 737 schools were launched in the State and are under different stages of completion. Officials said construction of 355 schools sanctioned under Phase I would be completed soon and work on another 164 school complexes was nearing final stages.
While the total outlay for the 355 schools listed under the first phase was Rs. 1,072.1 crore with each model school being allotted non-recurring grant of Rs. 3.02 crore (Rs. 2.72 crore for construction and another Rs. 30 lakh for civil works an furniture) and a recurring grant of Rs. 75 lakh, the phase I schools were sanctioned in the financial year 2011-12 and phase II in the current fiscal with the Central and State share for the project pegged at 75:25.

మోడల్‌ స్కూళ్ల నిర్మాణం వేగవంతం Prajasakthi

  • అధికారులకు సిఎం ఆదేశం - మేలో టీచర్ల నియామకాలు
  • వచ్చే విద్యాసంవత్సరం 355 పాఠశాలలు ప్రారంభం
రాష్ట్రంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌కు 737 పాఠశాలలు మంజూరయ్యాయని, అందులో రెండు దశల్లో 589 పాఠశాలల నిర్మాణ పనులను చేపడుతున్నామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 355 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 355 పాఠశాలల్లో 164 పాఠశాలల సముదాయాల నిర్మాణం చివరి దశకు చేరుకుందని, 104 పాఠశాలల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపింది. మొదటి దశలో నిర్మిస్తున్న 355 పాఠశాలలకు రూ.1072.10 కోట్లు కేటాయించబడ్డాయని పేర్కొంది. నాణ్యమైన అందించాలని కేంద్రం ఆరు వేల ఆదర్శ పాఠశాలలను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో ఆదర్శ పాఠశాలకూ ర.3.02 కోట్లు, వీటిలో రూ.2.72 కోట్లు సివిల్‌ పనులకు, రూ.30 లక్షలు ఫర్నీచర్‌, పరికరాలకు వినియోగించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో ఖర్చును భరిస్తాయని పేర్కొంది. 737 వెనుకబడిన మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపింది. వీటిలో 2011-12లో 355 స్కూళ్లు, 2012-13లో 234 పాఠశాలలు కేంద్రం మంజూరు చేసిందని పేర్కొంది.

మిగిలిన 148 పాఠశాలలను మంజూరు చేయాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి త్వరలో పంపిస్తామని తెలిపింది. 355 పాఠశాలలు జూన్‌ నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. స్టేట్‌ సిలబస్‌, ఆంగ్ల మాధ్యమంలో ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం(ఎంపిసి,బైపిసి,ఎంఇసి,సిఇసి గ్రూపులు) కో ఎడ్యుకేషన్‌ పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపింది. 355 పాఠశాలలకు 7,100 బోధన సిబ్బంది పోస్టుల నియామకాలను మేలో పూర్తి చేస్తామని పేర్కొంది. కొత్తగా నియమించిన ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపింది. వందమంది బాలికలు నివసించేటట్టు వసతి గృహాలు నిర్మిస్తున్నామని పేర్కొంది. హాస్టళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపింది. ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి నిబంధనలను ప్రభుత్వం గతనెల 11వ తేదీన విడుదల చేసిందని పేర్కొంది. మండలంలో నివాసముంటున్న లేదా చదువుకున్న విద్యార్థి ఈ పాఠశాలల్లో చేరడానికి అర్హులని ప్రకటించింది. ఆదాయ పరిమితి లేనప్పటికీ అల్పాదాయ వర్గాలకు ప్రాధాన్యతనిస్తామని తెలిపింది.

సత్వరమే ఆదర్శ పాఠశాలల నిర్మాణం  Eenadu: 04/03/2013
  సీఎం ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాఠశాల విద్యా శాఖాధికారులను ఆదేశించారు. ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణంపై మార్చి 3న సీఎం సమీక్ష నిర్వహించి, ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. 737 పాఠశాలలకు గాను 355 పాఠశాలల నిర్మాణం మొదటి దశలో పూర్తవుతుందని పేర్కొంది. ఇప్పటికే 164 పాఠశాల భవన సముదాయాల నిర్మాణం చివరి దశకు చేరిందని, 104 భవన సముదాయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంది. మొదటి దశలో మంజూరైన ఆదర్శ పాఠశాలలు వచ్చే జూన్ నుంచి ప్రారంభమవుతాయని సీఎం కార్యాలయo వెల్లడించింది.

మోడల్ స్కూల్ నిర్మాణాలు వేగవంతం  04/03/2013  Andhra Bhoomi
హైదరాబాద్, మార్చి 3: రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మొత్తం 737 పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటుండగా, అందులో తొలిదశలో 355 పాఠశాలల నిర్మాణం పూర్తికానుందని వెల్లడించారు. తొలిదశలో 1072 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయాల తరహాలో దేశ వ్యాప్తంగా ఆరు వేల మోడల్ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 737 వెనుకబడిన మండలాల్లో ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించారు. తొలిదశలో నిర్మిస్తున్న పాఠశాలలు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమవుతాయి. స్టేట్ సిలబస్, ఆంగ్ల భాషల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి, జూనియర్ ఇంటర్ వరకు కో-ఎడ్యుకేషన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 355 పాఠశాలలకు 7100 ఉపాధ్యాయ పోస్టులు మంజూరుకాగా, వారికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వంద మంది వరకు విద్యార్ధులు ఉండేలా నిర్మిస్తున్న హాస్టళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యార్ధుల చేరికకు సంబంధించి గత నెల 11వ తేదీన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మండలంలో ఉంటున్న, చదువుకుంటున్న వారిలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు ఆరు శాతం, బిసిలకు 29 శాతం, బాలికలకు 33.3శాతం సీట్లు కేటాయించడం జరిగిందని వారు వివరించారు.

  

మరిన్ని మోడల్ స్కూళ్ల కోసం త్వరలో ప్రతిపాదనలు: సీఎం

సాక్షి,హైదరాబాద్:కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి మొదటి దశలో మంజూరుచేసిన 355 మోడల్ స్కూళ ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యాశాఖఅధికారులను ఆదేశించారు. ఈ మేర కు సీఎం కార్యాలయం నుంచి ఆదివారం ఓప్రకటన విడుదలైంది. వచ్చే జూన్‌లో వీటిల్లో 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ,బైపీసీ,ఎంఈసీ,సీఈసీ గ్రూపులు) కోర్సును ప్రారంభించనున ్నట్లు పేర్కొన్నారు. ఇవికాకుండా రెండోదశలో ఇప్పటికే 234 స్కూళ్లు మంజూరయ్యాయని, మూడోదశ కింద మరో 148 స్కూళ్లను మంజూరు చేయాలని త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు. మొదటి దశలో మంజూరైన స్కూళ్లలో 164 స్కూళ్ల నిర్మాణాలు చివరిదశకు చేరుకోగా, మరో 104 స్కూళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీటి కోసం 7,100 మంది ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బందిని త్వరలో నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు ప్రతి పాఠశాల ఆవరణలో వంద మంది బాలికలకు తగినట్టుగా చేపట్టిన హాస్టల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

 

CM orders to Edn. Dept..

The Hyderabad Deccan English Daily
Speed up construction of model schools: CM N Kiran Kumar Reddy to officials
Hyderabad, March 3/2013 : Chief Minister N Kiran Kumar Reddy on Sunday directed the School Education department to speed up construction of the Government Model schools in the State.
Officials explained that out of the 737 schools, 355 will be completed in the I Phase of which 164 school complexes are nearing completion and 104 school complexes are going to reach finishing stage very shortly. The works at other places also will be speeded up. The total outlay for these 355 schools in the I Phase is Rs.1072.10 crores.
It may be recalled here that Government of India proposed to start 6000 Model Schools throughout the country to provide quality education at secondary level on Kendriya Vidyalaya template during 20011-12. For each Model School, the non-recurring Grant is Rs.3.02 crores (Rs.2.72 crores for civil works and Rs.0.30 crores for furniture and equipment) and Recurring Grant of Rs.0.75 crores. The ratio of Central and State share is 75:25. Government of Andhra Pradesh proposed to establish Model Schools in all the 737 Educationally Backward Mandals of the State. As many as 355 Model schools were sanctioned in Phase I during 2011-12 while 234 Model schools were sanctioned in Phase II during 2012-13.
Proposals for sanction of the balance 148 Model Schools will be sent to GoI shortly. The Phase I Model schools will start functioning from June 2013 with classes VI to VIII and Junior Intermediate (MPC, BPC, MEC and CEC groups) in English Medium with State syllabi and are co-educational institutions. 7,100 teaching posts are sanctioned for the 355 Model Schools sanctioned in Phase I. Staff recruitment work is in progress and all of them will be positioned by May 2013.
Induction training to the newly recruited teaching staff will be provided. Government of India have also sanctioned Girls Hostels to these Schools with an intake of 100 students and the grounding of works are about to take place. For the Model schools, Guidelines for Admissions were issued by the State Government on 11-2-2013.
The students who domicile from the mandal or studied in the particular Mandal are eligible for admission in these schools. 15 per cent seats are reserved for SCs, 6 per cent seats are for STs and 29 per cent seats are reserved for BCs. A total of 33.3 per cent of the total seats are reserved for girls. There is no income limit for admission but children from lower income group shall be preferred. Construction of school complexes for the 355 Model schools has been entrusted to Andhra Pradesh Educational and Welfare Infrastructure Development Corporation. (INN)


 

 Find a news clipping titled Adarsham-Ahwanam in Anathapur edition in the link.

http://www.eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-k2



Eenadu Prakasam Dt. 28/02/2013


 

Eenadu 27/02/2013

 

పూర్తికాని మోడల్ స్కూళ్ల నిర్మాణం

  • 25/02/2013 - Andhra Bhoomi
ఆదోని, ఫిబ్రవరి 24: ఆదోని డివిజన్‌లో మోడళ్ల స్కూళ్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. నాణ్యత ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడింది. స్కూళ్ల ఏర్పాటుకు విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యం చూపుతుంది. అందువలన కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు గత సంవత్సరమే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రారంభమయ్యేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యాశాఖ అధికారులు మోడల్ స్కూళ్ల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా ఉండరాదని శాసనసభ అంచనాల కమిటీ కూడ సూచించింది. స్కూళ్ల ఏర్పాటుపైన జరుగుతున్న జాప్యం పట్ల శాసనసభ అంచనాల కమిటీ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. వెనుకబడ్డ ప్రాంతంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు కేంద్రప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా 6వేల మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి పూనుకొంది. ఆదోని డివిజన్‌లోని ఆలూరు, ఆస్పరి, గోనెగండ్ల, కోసిగి, మద్దికెర, మంత్రాలయం, నందవరం, పత్తికొండ, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు మండలాల్లో మొదటిదశలో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకొంది. ఒక్కొక్క మోడల్ స్కూళ్ల నిర్మాణం మొత్తం ఐదు ఎకరాల్లో రూ. 3.2కోట్లతో ఒక్కొక్క స్కూలు నిర్మాణానికి నిధులు కూడ మంజూరు చేసింది. అయితే మోడల్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి లేదా ఉచితంగా ఎవరైనా దాతలు ఇస్తే ఆ ఐదు ఎకరాల్లో మోడల్ స్కూళ్ల నిర్మాణానికి నిర్మాణం చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖ మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు పూనుకోలేదు. ప్రస్తుతం కూడ ఆలూరు, ఆస్పరి, గోనెగండ్ల, కోసిగి, మద్దికెర, మంత్రాలయం, నందవరం, పత్తికొండ, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు మండలాల్లో కొనసాగుతున్న మోడల్ స్కూళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఒక గోనెగండ్లలో మాత్రమే మోడల్ స్కూలు నిర్మాణం చివరిదశకు చేరుకొంది. మిగిలిన ప్రాంతాల్లో మోడల్ స్కూళ్ల నిర్మాణం నత్తనడకన కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. కోసిగిలో నరసింహమూర్తి అనే దాత ఐదు ఎకరాల స్థలాన్ని గత సంవత్సరమే ప్రభుత్వానికి మోడల్ స్కూలుకోసం ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ పనులు చాలా ఆలస్యంగాప్రారంభమైయ్యాయి. ఇప్పటికే 30శాతం పనులు కూడ పూర్తికాని పరిస్థితి ఉంది. మద్దికెరలో 70శాతం మాత్రమే పూర్తికావడం జరిగింది. ఆస్పరిలోని పుట్టకలమర్రివద్ద నిర్మిస్తున్న పాఠశాల భవనం నిర్మాణం కూడ 60శాతం మాత్రమే పూర్తయింది. పత్తికొండ మండలంలో నిర్మిస్తున్న పాఠశాలకు కూడ 40శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ విధంగా నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. పాఠశాలల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 75శాతం నిధులు, రాష్ట్రప్రభుత్వం 25శాతం నిధులతో మోడల్ స్కూళ్ల నిర్మాణం కొనసాగుతోంది. మోడల్ స్కూళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగా మోడల్‌స్కూళ్ల ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఇంకా శిక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించాల్సి ఉంది. వీరిని కూడ ఎంపిక చేయాలి. వీరికి రీసర్స్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమాలు ఇస్తారు. అలాగే మొత్తం అంతా కూడ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు మోడల్ స్కూళ్లలో బాగా చదివి ప్రైవేట్‌స్కూళ్లకు ధీటుగా విద్యా వ్యవస్థను పటిష్ట పరచాలని కేంద్రప్రభుత్వం తలపెట్టిన మోడల్‌స్కూళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూళ్ల నిర్మాణంలో సిమెంట్ ఇటుకలు వాడడం వలన కట్టడాల మన్నిక సక్రమంగా ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి నాణ్యత విషయంలో కూడ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా మొదటిదశ మోడల్ స్కూళ్ల నిర్మాణమే నత్తనడకన సాగుతోంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి వచ్చే విద్యా సంవత్సరంకల్లా వచ్చే మోడల్ స్కూళ్ల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి.

 

 

కొత్త టీచర్లతో కొరత తీరేనా..? ఎస్‌ఎస్‌ఏ ద్వారా జిల్లాకు 390 ఎస్జీటీలు

సూపర్ న్యూమరరీ పోస్టులతో మరో 45పోస్టులు..?

అయినా ఇంకా 800 వరకు ఖాళీలు 

By Namaste Telangana-Rangareddy Dt.


రంగాడ్డి జిల్లా (టీ మీడియా): విద్యాహక్కు చట్టం నిబంధనల మేరకు ముఫ్పై మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు చొప్పున (1:30) జిల్లాకు సర్వశిక్షాఅభియాన్ ద్వారా 390 మంది స్పెషల్ గ్రేడ్ టీచర్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ-12 ద్వారా ఇప్పటికే జిల్లాలో దాదాపు 1400 మంది ఎస్జీటీ, ఎస్‌ఏ, లాంగ్వేజ్ పండిత్‌లు కొత్తగా నియమితులయ్యారు. అయినా జిల్లాకు టీచర్ల కొరత వేధిస్తోంది. డీఎస్సీ-12 ద్వారా కొత్త టీచర్లు వచ్చిన తర్వాత జిల్లాలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 689 మంది విద్యావలంటీర్లను తొలగించిన విషయం తెలిసిందే. ఇంకా 2299 మంది జిల్లాలో కొనసాగుతున్నారు. దీనిబట్టి జిల్లాలో టీచర్ల కొరత ఏమేరకు ఉందో తెలుస్తోంది. కొత్తగా సర్వశిక్షాఅభియాన్ ద్వారా జిల్లాకు కేటాయించిన 390 మంది ఎస్జీటీలను కొత్త డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే డీఎస్సీ-12 మొదటి లిస్టులో తమకు అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగిన అభ్యర్థుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా వీరికి అవకాశం కల్పించేందుకు సూత్రవూపాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే జిల్లాకు అదనంగా 45 మంది ఉపాధ్యాయులు నియమితులవుతారు. ఈ లెక్కన డీఎస్సీ-12 ద్వారా 1400 మంది, సర్వశిక్షాఅభియాన్ ద్వారా 390, సూపర్ న్యూమరరీ పోస్టింగ్‌ల ద్వారా మరో 45 మంది మొత్తం 1835 మంది కొత్త టీచర్లు జిల్లాలో నియమకం కానున్నారు. ఇంత జరిగినా ఇంకా జిల్లాలో టీచర్ల కొరత ఉంది. ఇంకా దాదాపు 800 వరకు ఖాళీలున్నాయి. కొత్త డీఎస్సీ ద్వారా వీరందరిని నియమిస్తే.. విద్యాహక్కు చట్టం ప్రకారం సరైన విద్య విద్యార్థులకు అందనుంది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1634 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 255, ఉన్నత పాఠశాలలు 418 ఉన్నాయి.

సూపర్ న్యూమరరీ పోస్టులు సాధ్యమేనా..?
డీఎస్సీ-12 ద్వారా మొదటి లిస్టులో పేర్లున్న అభ్యర్థులను తొలగించారని ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వీరికి సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా.. ప్రభుత్వ విచక్షణాధికారాన్ని ఉపయోగించి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సమాయత్తమయ్యింది. అయతే దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఎలాంటి సమాచారమూ అందలేదు. ఇదే జరిగితే జిల్లాకు దాదాపు 45 మంది వరకు కొత్త టీచర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి నియామకం గందరగోళంతో కూడకున్నదని, నియామకపు ప్రక్రియపై ఎలాంటి స్పష్టత లేకపోకపోవడంతో ఈ పోస్టులు భర్తీపై నమ్మకం లేదని ఆ శాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది.
మోడల్ స్కూళ్లు.. ఈ సారి ప్రారంభం..
జిల్లాలో మొత్తం 19 మోడల్ స్కూళ్లకు ఈ విద్యాసంవత్సరం నుంచే మోక్షం లభించనుంది. దాదాపు భవనాల నిర్మాణం కూడా పూర్తయ్యింది. పూర్తికాని భవనాలున్నా.. అద్దెభవనాల్లో కచ్చితంగా ఈయేడాది నుంచే పాఠశాలలు ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖాధికారులు కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే ఈ పాఠశాలల టీచర్లకు సంబంధించి నియామక ప్రక్రియ కూడా పూర్తికావస్తోంది.
2299 మంది వలంటీర్ల కొనసాగింపు..
డీఎస్సీ-12ద్వారా జిల్లాలో కొత్తగా నియామకమైన టీచర్ల స్థానంలో అప్పటి వరకు ఉన్న విద్యావలంటీర్లను రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఉద్వాసన పలికారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 689 మంది విద్యావలంటీర్లను తీసివేశారు. ఇంకా 2299 మంది ఖాళీలున్నచోట్ల కొనసాగుతున్నారు. మండలాల వారీగా తొలగింపు ఇలా.. మర్పల్లి మండలంలో మొత్తం 79 మంది విద్యావలంటీర్లు పనిచేస్తుండగా.. 11మందిని తొలగించారు. మోమిన్‌పేటలో 56 మందిలో 24 మందిని, నవాబ్‌పేటలో 31 మందికి 16గురిని తీసివేశారు. శంకర్‌పల్లిలో 25 మందిని వీవీలను తొలగించగా..

శేరిలింగంపల్లిలో ఒక్కరిని మాత్రమే తీసేశారు. బాలానగర్‌లో ముగ్గురిని తీసేయగా కుత్బుల్లాపూర్‌లో 202 మంది వీవీలను అలాగే కొనసాగిస్తున్నారు. మేడ్చల్‌లో 21 , శామీర్‌పేటలో 28, మల్కాజిగిరిలో ఇద్దరు, కీసరలో 13, ఘట్‌కేసర్‌లో 15, ఉప్పల్‌లో ముగ్గురు, హయత్‌నగర్‌లో 12, సరూర్‌నగర్‌లో ఒక్కరు, రాజేంవూదనగర్‌లో నలుగురు చొప్పున విద్యావలంటీర్లను తొలగించారు. మోయినాబాద్‌లో 13, చేవెళ్లలో 36, వికారాబాద్‌లో 14, ధారూర్‌లో 40, బంట్వారంలో 6, పెద్దేముల్‌లో 30, తాండూరులో 34, బషీరాబాద్‌లో 25, యాలాల్‌లో 13, దోమలో 29, గండీడ్‌లో 24, కుల్కచర్లలో 17, పరిగిలో 17, పూడూరులో 27, షాబాద్‌లో 12, శంషాబాద్‌లో 33, మహేశ్వరంలో 13, ఇబ్రహీంపట్నంలో 22, మంచాలలో 28, యాచారంలో 39, కందుకూర్‌లో 30 మంది విద్యావలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆదర్శం.. ఎప్పటికో!

17 Feb 2013 12:00,  Eenadu Rangareddy


ఆదర్శ పాఠశాలల భవనాల టెండర్లు దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీలు పడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన అంచనా వ్యయం(అప్‌సెట్‌ ప్రైస్‌) కంటే దాదాపు 6 శాతం తక్కువకే నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ ముందుకొచ్చారు. చివరికి సద్దుబాట్లు చేసుకొని పనులను పొందారు. అధికారులు ఈ పనులను మూడు, నాలుగు విభాగాలు(ప్యాకేజీలు)గా విడగొట్టి గుత్తేదారులకు అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకున్నారు. వాటిని దక్కించుకోవడంలో గుత్తేదారులు చూపిన శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించడంలేదు. కొన్నిచోట్ల స్థలాలు అప్పగించడంలో అధికారులు జాప్యం చేసినా, భూమి సిద్ధంగా ఉన్న చోట కూడా వేగంగా జరగడంలేదు. ఫలితంగా జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నాటికి కూడా జిల్లాలోని పలు ఆదర్శ పాఠశాల భవనాలు పూర్తి అవుతాయన్న నమ్మకం కలగడంలేదు.జిల్లాలో మొత్తం 19 మండలాల పరిధిలో సకల హంగులతో 19 ఆదర్శ పాఠశాలలు నిర్మించాలని భావించారు. వాస్తవానికి ఇవన్నీ గత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాల్సి ఉన్నా... నిధుల కేటాయింపులో జాప్యం, టెండర్లు నిర్వహించాల్సి రావడంతో సహజంగా పనులు కేటాయించడంలో జాప్యం చోటుచేసుకుంది. ఫలితంగా గత విద్యా సంవత్సరానికి నిర్మాణాలు ప్రారంభం కాలేదు. దీంతో కనీసం 2013-14 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికైనా భవనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ పనులు కొనసాగుతున్న తీరును 'ఈనాడు' క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రానున్న జూన్‌ నాటిని కూడా దాదాపు సగానికి పైగా భవనాలు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఒక్కో భవనానికి రూ. 3.02 కోట్ల చొప్పున మొత్తం రూ.57.38 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు కేవలం రూ.13.24 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.ఆదర్శ పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి వసతి గృహం కోసం రూ.1.28 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు అది ఎప్పటికి పూర్తవుతుందో... పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంటే ఆదర్శ పాఠశాలలు అరకొర వసతులతో ప్రారంభించినా అందులో బాలికలకు మాత్రం వసతి గృహాలు ఉండవని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఆదర్శ పాఠశాలల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదారులకు తాఖీదులు పంపుతున్నామని చెబుతున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే అపరాధ రుసుం ఉంటుందని అంటున్నారు..

 

 

 



Districts News » Prakasham » 18/02/2013

10 ఆదర్శ పాఠశాలలు సిద్ధం

ఒంగోలు విద్య: ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా కేంద్రీయ విద్యాలయాల తరహాలో నిర్వహించనున్న ఆదర్శ పా ఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా కు 11 ఆదర్శ పాఠశాలలు మంజూ రయ్యాయి. వీటిల్లో చీరాలలో ఏర్పా టు కానున్న మోడల్ స్కూలుకు స్థల సేకరణ సమస్యగా మారటంతో ఆగి పోయింది. ఇక మిగిలిన పది పాఠశా లలు రానున్న విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతా యి.

ఇందుకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కూ డా పూర్తయింది. ఈ వేసవిలో కౌన్సె లింగ్ ద్వారా ఎంపికైన పోస్టుగ్రాడ్యు యేట్ టీచర్ల(పిీజీటీ)లను ఆయా స్కూళ్లల్లో నియామకం చేస్తారు. ఇం గ్లీషు మీడియంలో కో-ఎడ్యుకేషన్ ద్వారా విద్యను అందించనున్న ఆద ర్శ పాఠశాలల నిర్వహణకు సంబం ధించి ప్రభుత్వం రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ ద్వారా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

చీరాలలో స్థల సమస్య

జిల్లాకు మొత్తం 11 ఆదర్శ పాఠ శాలలను ప్రభుత్వం మంజూరు చే సింది. ముండ్లమూరు, దర్శి, చుం డి(వివి.పాలెం మండలం), జి.మేక పాడు(కందుకూరు మండలం), మా ర్కాపురం, కనిగిరి, దోర్నాల, రాచర్ల, ఉలవపాడు, చీరాల మండలాలకు ఆ దర్శ పాఠశాలలను మంజూరు చేశా రు. వీటికి స్థల సేకరణ జరిపి, సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం అ దేశించింది. ఒక్కో ఆదర్శ పాఠశాల భ వన నిర్మాణానికి రూ.1.50 కోట్ల వర కు ప్రభుత్వం నిధులు కూడా విడు దల చేసింది. రెసిడెన్షియల్ తరహాలో విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఆదర్శ పాఠశాలలను పూర్తి చేసి 20 13-14 విద్యా సంవత్సరం నుంచి త రగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. పది ఆదర్శ పాఠశాలల నిర్మాణాలు పూర్తయ్యా యి. రెండు చోట్ల ఈ మార్చికి పూర్తవు తాయి. చీరాలలో ఏర్పాటు చేయద ల్చిన ఆదర్శ పాఠశాలకు స్థలం దొరక లేదు. ఇందుకు సంబంధించి జిల్లా ఆర్ఎంఎస్ఏ అధికారి బి.విజయ భాస్కర్ స్థలం కోసం నివేదికను కూ డా అందజేశారు. అదేక్రమంలో రాను న్న విద్యా సంవత్సరానికి పదింటిలో ప్రవేశాలు కల్పించేందుకు గాను నివే దిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించారు.

6,7,8 తరగతులకు సన్నాహాలు

2013-14 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించి, 6,7,8 తరగ తులు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు ఆర్ఎంఎస్ఏ అధికారులు పే ర్కొంటున్నారు. సొంత భవనాలు ని ర్మించి ప్రవేశాలు నిర్వహిస్తున్నవి ఆ దర్శ పాఠశాలలే కావటం విశేషం. ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ చివరి వా రం నుంచి నిర్వహిస్తారు. దరఖాస్తులు రాష్ట్రీయ మాధ్యమిక విద్యామిషన్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. సంబం ధిత మండలాల్లోని ప్రాథమిక పాఠశా లల్లో చదివిన విద్యార్థులు ఆదర్శ పా ఠశాలల్లో చేరేందుకు అర్హులు. విద్యా హక్కుచట్టం ప్రకారం లాటరీ విధా నం ద్వారానే ప్రవేశాలు కల్పిం చనున్నారు.

2400 మంది విద్యార్థులకు లబ్ధి

6,7,8 తరగతుల్లో రెండు సెక్షన్ లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సెక్షన్ 40మంది విద్యార్థుల చొప్పున ఒ క్కో పాఠశాలలో 240మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. 2014 జూన్‌లో ఈ ఆదర్శ పాఠశాలల్లో 9వ తరగతిని ప్రారంభిస్తారు. అదేక్రమంలో 2015 లో పదవ తరగతిని, ఇంటర్ మీడి యట్ ప్రథమ సంవత్సరం కోర్సును ప్రారంభిస్తారు. ఇలా ఒక్కో పాఠ శా లలో 320మంది విద్యార్థులకు ప్రవే శాలు కల్పిస్తారు. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది పిల్లలకు ఒక్కో తరగతిలో అయిదుగురు చొప్పున మొ త్తం 20మందికి అ వకాశం కల్పిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ నే తృత్వంలో కేటాయిస్తారు.

ఈ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థుల కు 15శాతం, ఎస్టీ విద్యార్థులకు 6శా తం, బీసీ ఏ విద్యార్థులకు 7శాతం, బీ సీ బి విద్యార్థులకు 10 శాతం, బీసీ సి విద్యార్థులకు 1శాతం, బీసీ డి వి ద్యార్థులకు 7శాతం, బీసీ ఈ విద్యా ర్థులకు 4శాతం, వికలాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. అదే క్రమంలో బాలికలకు 33.33శాతం సీట్లను కేటాయిస్తారు. ఇతర సామా జిక వర్గాలకు 50శాతం సీట్లు కేటా యించారు. ఈ అన్ని వర్గాలలో అల్పా దాయ వర్గాల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుందని మార్గదర్శ కాలు సూచిస్తున్నాయి.


Districts News » East Godavari »17/12/2012

2013 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలలు సిద్ధం

కత్తిపూడి: రాష్ట్రంలో 2013-14 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నిర్మాణ దశలో ఉన్న 355 ఆ దర్శ పాఠశాలలు అన్ని సౌకర్యాలతో ప్రారంభానికి సిద్ధమవుతాయని రాష్ట్రీ య మాధ్యమిక శిక్షాభియాన్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. శంఖవరం లో నిర్మాణ దశలో ఉన్న ఆదర్శ పా ఠశాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇ ప్పటికే ఆదర్శ పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి చే శామన్నారు.

భవనాల నిర్మాణ పను లు పూర్తి కావడంతో గతేడాదే తరగతి గదులను ప్రారంభించాలని అనుకు న్నాం కానీ పారదర్శకత లోపంతో సా ధ్యం కాలేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఈ పాఠశాలల్లో వి ద్యాభ్యాసం ఉంటుందని సత్యనారా యణ తెలిపారు. ఎంఈవో కేవీ రమణమ్మను మండల విద్యా స్థితిగతులపై ఆరా తీసి మధ్యాహ్నం భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పిఠాపురం డీవైఈవో అ బ్రహం, విశాఖ జిల్లా డిప్యూటీ డీఈవో మధుసుదన్, పాఠశాల హెచ్ఎం ఎం. బాబూరావు, కుర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




ఆదర్శ పాఠశాలలు జూన్‌లో ప్రారంభం :విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 11 (టీ మీడియా): రాష్ట్రవ్యాప్తంగా మొదటిదశలో నిర్మిస్తున్న 355 ఆదర్శ పాఠశాలలను వచ్చే జూన్‌లో ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ తెలిపారు. నల్లగొండ జిల్లాలో నిర్మిస్తున్న వివిధ పాఠశాల భవనాలను విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, మార్చిలో నియామకాలు పూర్తిచేసి అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్స్‌లో 6 నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయని, సెక్షన్‌కు 40 మంది చొప్పున విద్యార్థులను చేర్చుకుంటామని పేర్కొన్నారు. రెండవదశలో రాష్ట్రవ్యాప్తంగా 234 స్కూళ్లను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటికి అనుసంధానంగా త్వరలో 100 పడకలతో బాలికల కోసం వసతి గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శివశంకర్, ఏడీ సూర్యనారాయణ, ఈఈ ప్రభాకర్‌డ్డి తదితరులు ఉన్నారు.


మో‘డల్’ స్కూళ్లు by Sakshi

14/2/2013 11:51:00 PM
రామాయంపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నిర్మాణం 2012 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. 2014 జనవరి నాటికి కూడా భవన నిర్మాణం పూర్తయ్యే సూచన కనిపించడం లేదు. భూ సేకరణలో నెలకొన్న జాప్యం కారణంగా సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు.
టేక్మాల్ మండల కేంద్రంలో ప్రతిపాదిత ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారిపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవతో సమస్య పరిష్కారమైనా నిర్మాణ పనులు పునాది దశలోనే ఉన్నాయి. జిల్లాలో కొనసా...గుతోన్న మోడల్ స్కూల్ భవన నిర్మాణాల తీరుకు పై రెండు ఉదాహరణలు కేవలం ముచ్చుకు మాత్రమే. జిల్లాలో తొలివిడతగా నిర్మించాల్సిన 24 భవన నిర్మాణాల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. దీంతో వచ్చే విద్యాసంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కష్టసాధ్యమని తేల్చిన అధికారులు....గడువును మరో సంవత్సరానికి పొడిగించుకున్నారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:మో‘డల్’ స్కూళ్ల భవన నిర్మాణ పనులు నత్తేనయంగా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాధ్యమిక విద్యాశాఖ ద్వారా తొలి విడతలో జిల్లాలో 24 ఆదర్శ పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వచ్చే జూన్ నాటికి కనీసం 10 భవనాలు కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 2012-13 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని అధికారులు గతంలోనే ప్రణాళిక రూపొందించారు. టెండర్ దక్కించుకున్న సంస్థలతో మాట్లాడి 16 నెలల్లోనే భవన నిర్మాణ పనులు పూర్తి చేసేలా ఒప్పించారు. ఈ మేరకు ఒప్పందం పత్రాలపై సంతకాలు కూడా చేశారు.

నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు (ఏపీఈడబ్ల్యూఐడీసీ) అప్పగించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించారు. అయితే పనుల్లో మాత్రం పురోగతి కనిపించలేదు. అధికారులు అనుకున్న లక్ష్యం నెరవేర లేదు. దీంతో మరో ఐదు నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా, నిర్మాణాలు మాత్రం మరో ఏడాదికి గాని పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో విద్యాశాఖ అధికారులు 2013-14 విద్యా సంవత్సరానికి తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేశారు. అనంతరం మోడల్ స్కూళ్లలో తరగతుల నిర్వహణపై ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారా క్షేత్రస్థాయి వివరాలు సేకరించారు. ఆ వివరాల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి 14 ఆదర్శ పాఠశాలల భవనాల నిర్మాణాలు పూర్తవుతాయని, కానీ 8 చోట్ల మాత్రమే తరగతుల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు జూన్ నాటికి సమకూరుతాయని ఏపీఈడబ్ల్యూఐడీసీ తన నివేదికలో వెళ్లడించింది.

వ చ్చే యేడాది అనుమానమే!
పటాన్‌చెరు, తొగుట, కోహీర్ మండలాలను మినహాయించి విద్యాపరంగా వెనుకబడిన మిగతా 43 మండలాల్లో ఆదర్శ పాఠశాలలు నిర్మించాలని 2010లో ప్రతిపాదించారు. అయితే సకాలంలో ప్రతిపాదనలు వెళ్లకపోవడంతో తొలి విడతలో 24 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు మాత్రమే అమోదం లభించింది. రూ.72.48 కోట్లతో భవనాలు ప్రతిపాదించగా, ఇప్పటి వరకు రూ.13.71 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీఈడబ్ల్యూఐడీసీ చెప్తోంది. రెండో విడతలో మిగతా 19 ఆదర్శ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పినా, ఇప్పటి వరకు పురోగతి లేదు. స్తల సేకరణ, ఇసుక వాడకంపై నిషేధం, స్థానిక సమస్యల కారణంగా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిల్ కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు.

ఆదర్శ పాఠశాలల్లో బోధనకు అవసరమైన టీజీటీ, పీజీటీ కేడర్ ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయినా, నియామకాలు జరగలేదు. 2013 జూన్ నాటికి భవన నిర్మాణం పూర్తయిన చోటే భర్తీ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. తొలి యేడాది ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీషు మీడియంలో బోధనకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ జి.రమేశ్ ‘సాక్షి’కి వెల్లడించారు.

Districts News » Viziayanagaram »

మోడల్!

పార్వతీపురం: ఆదర్శ (మోడల్) పాఠశాలల ఏర్పాటుపై ప్రభుత్వం తగిన శ్రద్ధ వహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసేందుకు వీలుగా ఎంపిక కార్యక్రమం పూర్తిచేసింది. అయినప్పటికీ వీరి నియామకాలకు సంబంధించి ఇంతవరకు స్పందన కన్పించడం లేదు. ఇదే మాదిరిగా పాఠశాలల నిర్మాణం పరిస్థితి తయారైంది. జిల్లావ్యాప్తంగా గుమ్మలక్ష్మీపురం మినహా అన్ని మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మండలస్థాయిల్లో స్పందన అం తంత మాత్రంగా కన్పించడంతో కుదించింది. ఇప్పుడు ఏకంగా స్థల సమస్య తెరపైకి రావడంతో కొన్ని మండలాల్లో మాత్రమే ఆదర్శ పాఠశాలలకు అవకాశం లభించనుంది. అనేక మండలా ల్లో స్థలం చూపకపోవడంతో ఈ పాఠశాలలు దూరం కానున్నాయి. జియ్యమ్మవలసతో సహా అనేక మండలాల్లో స్థలాన్ని చూపలేక పాఠశాలలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆదర్శ పాఠశాలకు కనీసం ఐదెకరాల స్థలం ఉండాలని నిబంధన విధించడంతో కొద్ది మండలాలు మాత్రమే ముందుకు వచ్చి నిర్మాణాలను నిర్వహిస్తున్నారు.

ఇలా ముందుకు వచ్చి పాఠశాలల నిర్మాణం చేపట్టిన మండలాల్లో కూడా తగిన పురోగతి కన్పించడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందించగలరో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురుపాం లో మంజూరైన ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం ప్రారంభమైంది. రెండో అంతస్తు పనులు ప్రస్తు తం జరుగుతున్నాయి. అనేకచోట్ల ఇంకా పనులు మొదటి దశ భవన నిర్మాణ స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం.

ఆదర్శ పాఠశాలలు ఎందుకంటే: ఆదర్శ పాఠశాలలను ఆరు నుంచి ఇంటర్ వరకు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

తెలుగు మాధ్యమ ఉపాద్యాయులకు అవకా శం కల్పించాలని అప్పట్లో డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం తలవంచలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇం టర్ వరకు ఆదర్శ పాఠశాలను నడపాలన్నది ఉద్దేశం. మాధ్యమిక విద్యను ఇంటర్ వరకు గుర్తించి ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాలలు ఏర్పాటైతే ఇంగ్లీషు మాధ్యమ సమస్య కొంతవరకు నెట్టుకురావచ్చు.

అయితే ప్రస్తుతం మండలాల్లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సక్సెస్ పాఠశాలల నుంచి వస్తున్న విద్యార్థులు ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియంలో చదివేందుకు ఇబ్బందులు తప్పేలా లేదు.. ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ పాఠశాలలు ఆరో తరగతి నుంచి ప్రారంభం కావడం వల్ల ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకే ఇంటర్‌లో కూడా అవకాశం ఉంటుంది. అయితే సీట్లు ఖాళీగా ఉన్న ప్రాప్తికి మాత్రమే బయటి పాఠశాలల నుంచి చదువుకున్న విద్యార్థులకు ఇంటర్‌లో చేరేందుకు అవకాశం ప్రస్తుతానికి ఉన్నట్లే. ఏది ఏమైనప్పటికీ ఆదర్శ పాఠశాలలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Districts News » Rangareddy » 13/02/2013

మో'డల్ ' నిర్మాణాలు

పరిగి: గ్రామీణ స్థాయి పేద విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంలో నాణ్యత గల విద్యను అందించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మోడల్ స్కూళ్లు జూన్ నుంచైనా ప్రారంభమయ్యేనా? అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఒక్కో మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.02 కోట్ల నిధులను కేటాయించింది. పరిగి నియోజకవర్గంలోని ఐదు మండలాలకుగాను రూ.15.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. గత జూన్ నుంచే ప్రారంభం కావాల్సి మోడల్ స్కూళ్లు ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆదిలోనే ఆటంకాలను ఎదుర్కొన్నాయి. గత జూన్ ప్రారంభంలో విద్యార్థుల అడ్మిషన్‌ల కోసం దరఖాస్తులను కూడా తీసుకుని వదిలేశారు.

అందులో భాగంగానే జూన్ 28న రాష్ట్ర హోంమంత్రి పి.సబితారెడ్డి అన్ని మండలాల్లో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. దోమలో తప్ప మిగతా మండలాల్లో పనులు ప్రారంభించినప్పటికీ ఏడాది నుంచి నత్తనడకగానే కొనసాగుతున్నాయి. మోడల్ స్కూళ్లు మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. అయితే మండల కేంద్రంలో స్థలం లేనికారణంగా పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉండగా, ఎక్కడా మండల కేంద్రంలో నిర్మాణాలు జరగడంలేదు.

జూన్ 28న పూడూరు మండలం మన్నెగూడలో మోడల్‌స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉనప్పటీకీ అక్కడస్థలం లేనికారణంగా మన్నెగూడలో నిర్మించాలని భావించారు. అయితే అక్కడ కూడా కాకుండా ఎన్కెపల్లిలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. రాజకీయ ఆధిపత్యం మూలంగానే ఎన్కెపల్లిలో మోడల్ స్కూల్‌ను నిర్మిస్తున్నారు. కులకచర్లలో నిర్మించాల్సిన స్కూల్‌ను ముజాహిద్‌పూర్‌లో నిర్మిస్తున్నారు. గండీడ్‌లో నిర్మించాల్సిన స్కూల్‌ను వేన్నాచేడ్‌లో నిర్మిస్తున్నారు. పరిగిలో నిర్మించాల్సిన స్కూల్ జాఫర్‌పల్లిలో నిర్మిస్తున్నారు.

దోమ మాడల్ స్కూల్ వ్యవహరం ఏడాదిగా పెండింగ్‌లో ఉంది. మొదటగా దోమలో మోడల్ స్కూల్ నిర్మాణానికి స్థలం గుర్తించకపోవడంతో మండలంలోని దిర్సంపల్లి గ్రామంలో స్థలాన్ని గుర్తించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఆ తర్వాత కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దాదాపూర్‌కు మార్చేందుకు ప్రయత్నించారు. ఓ కేంద్రమంత్రి సిఫారస్సుతో దాదాపూర్‌కు మార్చారు. అయితే స్కూల్ ఏర్పాటు విషయంలో దాదాపూర్, దిర్సంపల్లి గ్రామస్థులు తీవ్రంగా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో దిర్సంపల్లి గ్రామస్థులు దోమ మండల తహాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, గిరిజనులు ఏకంగా ఆత్మహత్య చేసుకుంటామని మందు డబ్బాలతో హెచ్చరించారు. అప్పట్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేవెళ్ల ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఈవో ఉషారాణితోపాటు వివిధ శాఖల అధికారులు దాదాపూర్, దిర్సంపల్లి గ్రామాలను సందర్శించి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. రెండు గ్రామాల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రానికి చెందిన నాయకులు దోమలో కూడా స్థలం చూయించారు. మోడల్ స్కూల్ ఎక్కడ నిర్మించాలనే విషయమై అధికారుల్లో అయోమయంగా నెలకొంది. మూడు గ్రామాలకు చెందిన నాయకులు మంత్రుల సిఫారస్సుల కోసం తిరుగుతున్నారు. దోమ మండల మోడల్ స్కూల్ వ్యవహరం అధికారులకు తలనొప్పిగా మారింది.

వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి మాడల్ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి నుంచి ఎంత వేగంగా నిర్మించినా పూర్తి కావడం అంత సులభం కాదు. పాఠశాలలు ప్రారంభం నాటికి భవననిర్మాణాలు పూర్తి చేసి అప్పగించాల్సి ఉంటుంది. దోమలో అసలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ప్రారంభించిన చోట పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. స్థలం విషయంలో ఇంకా కొన్నిచోట్ల వివాదాలు కొనసాగుతుండటంతో ఈ ఏడాదైనా ప్రారంభమవుతాయా? అన్న సందేహం కలుగుతోంది.

మో'డల్‌' స్కూళ్లు

  • 335లో ఒక్కటీ పూర్తికాలేదు 
  • పలు జిల్లాల్లో ఇసుక కొరత 
  • రెండో విడతకు ఆటంకం నూతన నిబంధనలు
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మోడల్‌ స్కూళ్ల (ఆదర్శ పాఠశాలల)కు ఆది నుండీ సమస్యలు ఎదురవుతున్నాయి. భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకవైపు ఇసుక కొరత, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండోవిడత సవరించిన నిబంధనలు ఈ పథకం జాప్యానికి ప్రధాన కారణంగా తయారయ్యాయి. ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో స్థలం దొరక్క 18 పాఠశాలల నిర్మాణం ప్రారంభం కాలేదు. మరోవైపు పెరిగిన నిర్మాణ ఖర్చుల వల్ల కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. ప్రయివేటు పాఠశాలల పోటీని తట్టుకునేందుకు విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, హైదరాబాద్‌ జిల్లాలు మినహా 21 జిల్లాల్లో 355 పాఠశాలల నిర్మాణానికి రూ.1,072.10కోట్లు మొదటివిడతగా ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం మంజూరు చేసింది. 2013 మార్చి నాటికి వీటిని అన్ని హంగులతో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ రూ.314.80 కోట్లు ఖర్చు చేయగా, 83 పాఠశాలల భవనాల నిర్మాణమే చివరిదశకు చేరుకుంది. సంపూర్ణంగా పూర్తయిన ఆదర్శ పాఠశాల భవనం ఒకటీ లేదు. మొదటి విడతలో పునాది దశకు కూడా చేరుకోనివి 56 ఉండగా, పునాదుల వరకూ వచ్చినవి 35, శ్లాబుకు దగ్గరగా వచ్చినవి 32 ఉన్నాయి. శ్లాబ్‌స్థాయికి చేరినవి 131 భవనాలున్నాయి.
వెంటాడుతున్న ఇసుక కొరత
విజయనగరం, ప్రకాశం, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో పాఠశాలల నిర్మాణాలకు ఇసుక కొరత ఆటంకంగా మారిందని రాష్ట్రస్థాయి ఇంజనీరు ఒకరు 'ప్రజాశక్తి'కి చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 19 పాఠశాలల నిర్మాణాన్ని ప్రారంభిస్తే, మూడు పూర్తయ్యే దశ (ఫినిషింగ్‌ లెవెల్‌)లో ఉండగా, అనంతపురంలో 25 భవనాలకు నాలుగే పూర్తయ్యే దశలో ఉన్నాయి. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే వేగంగా భవనాల నిర్మాణం పూర్తవుతోంది. 33కుగాను 28 భవనాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 355 పాఠశాలలకు ఇప్పటికి ఒక్క భవనం కూడా పూర్తిగా నిర్మించలేదని సదరు ఇంజనీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కార్యకలాపాలకు అనుమతుల్లేకుండానే వెళ్తున్న ఇసుక ప్రభుత్వ నిర్మాణాలకు లభ్యం కావడం లేదు. విజయనగరం జిల్లాలో మొదటివిడత 14 మండలాల్లో ఆదర్శ పాఠశాలల నిర్మాణాలకు అనుమతులు రాగా, 2013 జూన్‌ నాటికి 10 మాత్రమే పూర్తి చేయగలమనీ, ఇసుక దొరకడం లేదనీ సంబంధిత జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు రాంప్రసాద్‌ వెల్లడించారు.
మారిన నిబంధనలు..
మొదటివిడతకూ రెండోవిడతకూ నిబంధనలను కేంద్రం మార్చేసింది. మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏ గ్రామంలోనైనా నాలుగు ఎకరాల్లో ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయాలని తొలివిడతలో ప్రభుత్వం పేర్కొంది. రెండోవిడత అనుమతుల దగ్గరకు వచ్చేసరికి మండల కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేసింది. విజయనగరం జిల్లాలో రెండోవిడత 17 పాఠశాలలకు డిఇఓ ప్రతిపాదనలు పంపించగా, నాలుగింటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అనేక జిల్లాల్లో మండల కేంద్రంలో నాలుగు ఎకరాల స్థలం దొరక్కపోవడంతో పాఠశాలల నిర్మాణం ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితిని పరిశీలిస్తే, రెండోవిడతగా రాష్ట్రంలో మంజూరు కావాల్సిన 400 ఆదర్శ పాఠశాలల్లో సింహభాగం ప్రారంభం కావని అర్థమవుతోంది. భవనాల నిర్మాణానికి ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించినా, పెద్దగా స్పందన రావడం లేదు. రెండోవిడత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనల వరకూ వెళ్లినా అనుమతులు రావడం లేదు.
పెరిగిన ఖర్చు కేంద్రం ఇస్తుందా?
ఆదర్శ భవన నిర్మాణాలు ప్రారంభమైన 2012 మార్చిలో ఒక్కొక్క పాఠశాలకూ రూ.3 కోట్లా 2 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. 2007కి ముందు ఎస్సీ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంగా పిలువబడే ఎపిఇఅండ్‌డబ్ల్యుఐడిసి (ఎపి విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ) పనులు చేపడుతోంది. నిర్మాణ ఖర్చు ఈ ఏడాది పెరిగిపోవడంతో టెండర్లకు స్పందన రావడం లేదని విజయనగరం జిల్లా ఎపిఇడబ్ల్యుఐడిసి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు రామ్‌ప్రసాద్‌ చెప్పారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లంతా ఒక భవన నిర్మాణానికి రూ.3 కోట్లా 40లక్షలు కావాలని కోరుతున్నట్లు తెలిపారు. నిర్మాణాలకు సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌లు (యుసిలు) సమర్పిస్తే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలకు జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖాధికార్లు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చారు. 

Districts News » Medak » 25/12/2012

రూ.కోట్లు వెచ్చించి మో'డల్' నిర్మాణం

అల్లాదుర్గం: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్ భవన నిర్మాణం కోసం మంజూరు చేసిన నిధులతో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతితో రాజ్యమేలుతున్నారంటూ టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నాడు ఈ పనులను పరిశీలించి అధికారులపై, కాంట్రాక్టర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే ఇలా ఉన్నాయి.

అల్లాదుర్గం మండలంలోని పోతులబోగూడ గ్రామ శివారులో మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టారు. అయితే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసిరకంగా పనులు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెలంగాణ జాగృతి జిల్లా కోకన్వీనర్ భిక్షపతి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కుతుబుద్దీన్, యువత విభాగం మండల అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ల ఆ«ధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాసిరకంగా నిర్మాణం పనులుండడంతో నాయకులు అధికారులపై మండిపడ్డారు.

కాంట్రాక్టర్లకు సంబంధించిన కొందరు యువకులు వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి మారింది. టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు సంబంధింత ఉన్నత స్థాయి అధికారులకు నాసిరకం పనులపై ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వర్క్ ఇన్‌స్పెక్టర్ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. 'చిన్నారుల భవిష్యత్ కోసం కేటాయించిన నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి దండుకుంటున్నా చోద్యం చూస్తున్నారా?' అంటూ వర్క్ ఇన్స్‌స్పెక్టర్‌పై మండిపడ్డారు. ఆయనకు బీటలు వారిన స్లాబ్ పనులను, ఇనుప చువ్వలు తేలిన పిల్లర్లను ఆయనకు చూపించారు. ఉపముఖ్యమంత్రి పేరు చెబుతూ నాసిరకం పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా... - వర్క్ఇన్స్‌స్పెక్టర్ మల్లప్ప పోతులబోగూడ శివారులో మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులపై పలుమార్లు జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశానని వర్క్ ఇన్‌స్పెక్టర్ మల్లప్ప తెలిపారు. పనులలో క్యూరింగ్ లేదని, నాసిరకం ఇసుకను వాడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాంట్రాక్టర్‌ను ఆదేశించినా నాసిరకం ఇసుకను ఉపయోగిస్తున్నారని మల్లప్ప అంగీకరించారు. పనులను తక్షణమే అపకుంటే తామే కూల్చి వేస్తామని తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.


పాఠశాలల భవనాలు జూన్‌లోగా పూర్తి చేయాలి : కలెక్టర్

  • 25/12/2012 Karimnagar by Andhra Bhoomi
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 24: జిల్లాలో మంజూరైన 47 మో డల్ పాఠశాలల భవనాల నిర్మాణం జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. జిల్లాలో 47 మోడల్ పాఠశాల భవనాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 47 భవనాల నిర్మాణాలు ప్రారంభించినట్లు, అందులో 20 పూర్తయ్యే దశలోనున్నవని తెలిపారు. ఆరు పై కప్పు స్థాయిలో ఉన్నవని, మిగతా భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా, సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో నూతనంగా 42 కస్తూరిభా గాంధీ విద్యాలయాల భవనాల నిర్మాణాలకు మంజూరు కాగా, ఇందులో 15 భవనాల నిర్మాణం ప్రారంభించినట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జెసి హెచ్.అరుణ్ కుమార్, డిఆర్‌ఓ గోపాల కృష్ణ ప్రసాద్, డిఆర్‌డిఎ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌లు శంకరయ్య, మనోహర్, జడ్పీ సిఇఓ చక్రధర్ రావు, ఆర్‌విఎం ఇంచార్జి ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్ రావు, విద్యా, సంక్షేమ, వౌళిక సదుపాయాల సంస్థ ఇఇ హఫీమియా, ఆర్‌డిఓ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.



Districts News » Karimnagar » 08/01/2013

మోడల్ స్కూల్ భవనాలు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి:కలెక్టర్ స్మితా సబర్వాల్

కరీంనగర్ టౌన్: జిల్లాలో మంజూరైన 47మోడల్ స్కూల్ భవనాల నిర్మా ణ పనులు త్వరితగతిన పూర్తి చేసి జూ న్‌లో విద్యా సంవత్సరం ప్రారంభంలో గా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మోడల్ స్కూల్, కస్తూరిబా వి ద్యాలయాలు, స్త్రీ శక్తి భవనాల నిర్మాణాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 47 మో డల్ స్కూల్ భవనాల నిర్మాణాలలో 25 భవనాల నిర్మాణాలు తుది దశలో ఉ న్నాయని, మిగతా భవనాల నిర్మాణాల ను విద్యా సంవత్సరం జూన్ లోగా పూ ర్తిచేసి ప్రారంభించాలన్నారు. మోడల్ స్కూల్ భవనాల నిర్మాణ పనులకు సం బంధించి అప్రోచ్ రోడ్లు, రక్షిత మంచినీ టి సౌకర్యం, విద్యుత్ సరఫరా పనుల ను ఆర్‌డబ్ల్యూఎస్ పంచాయతీ రాజ్, ట్రాన్స్‌కో, విద్యా శాఖ అధికారులు స మన్వయంతో పనిచేసి పనులు ప్రారంభించాల న్నారు. ఈ నెల 15లోగా పం చాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు అప్రోచ్ రోడ్ల అంచనాలు ఆర్‌డబ్ల్యూఎస్ రక్షిత మంచినీటి సౌకర్యం పనులో అంచనాలు రూపొందించాలన్నారు.

అ ప్రోచ్ రోడ్లను ఉపాధిహామీ పథకం కింద చేపట్టనున్నందున్న అంచనాలకు సంబంధించి గ్రామ సభలలో ఆమోదించిన తర్వాత ఎంపీడీవోల ద్వారా ప్ర తిపాదనలు పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జి ల్లా విద్యాశాఖాధికారి నోడల్ అధికారి గా సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. ఈ సమావేశంలో జాయిం ట్ కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, డీఆర్‌వో గోపాలకృష్ణ ప్రసాదరావు, డీఆర్‌డీఎ డ్వామా పీడీలు శంకరయ్య, మనోహర్, జడ్పీ సీఈవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.







మోడల్ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు 

  • Andhra bhoomi-Kadapa dated 27/12/2012
కడప (రూరల్), డిసెంబర్ 26 : మే నెల లోపల అన్ని మోడల్ స్కూళ్ల భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వి. అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌లోని సిఇఓ ఛాంబర్‌లో ఆర్‌ఎంఎస్‌ఎ ఫెస్-1 మోడల్ స్కూల్స్ జిల్లాలో అమలు తీరుపై ఇఇ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎపిఇ డబ్ల్యు ఇడిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 మే నెల లోపల జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు. ఫెస్-1 కింద జిల్లాలో 8 మోడల్ స్కూళ్లు, భవన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నామన్నారు. ఇందు కోసం 741.93 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుతున్నామని తెలిపారు. రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పుల్లంపేట, వల్లూరు, ఖాజీపేట, కాశినాయన ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు చేపట్టుతున్నామని తెలిపారు. సంబేపల్లె, పెనగలూరులో భవన సదుపాయం కోసం భూ సేకరణ జరగాల్సి ఉన్నందున త్వరలో రెండు ప్రాంతాల్లో పనులు చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు చేపట్టుతున్నామన్నారు. ఈ స్కూళ్లకు 80 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ భరిస్తోందన్నారు. భవన నిర్మాణాల పనుల కోసం ఇసుక కొరత ఉన్నందున త్వరలో తెలుగుగంగ ఎస్‌ఇతో మాట్లాడి ఇసుక ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫెస్-2 కింద 17 ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. చాపాడు, ఓబుళవారిపల్లెలలో స్థల సేకరణ కొరకు చర్యలు చేపట్టుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఎస్‌ఎ అధికారులు సి. చంద్రశేఖర్‌రెడ్డి, గురువిరెడ్డి, మురళీధర్‌రెడ్డి, నసీద్, వరలక్ష్మి, రవీంద్రుడు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికే ఆదర్శ పాఠశాలలు

  • 13/05/2012 Karim Nagar by Andhra Bhoomi
రామడుగు, మే 12: పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ధృడ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మండల కేంద్రంలో రూ.3.20 కోట్ల వ్యయంతో చేపట్టిన మోడల్స్ స్కూల్ భవన నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో 31 పాఠశాలలు మంజూరవ్వగా, ప్రస్తుతం 28 పాఠశాలలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. పదహారు నెలల కాలపరిమితితో ఎలాంటి లోపాలు లేకుండా వీటి పనులను పూర్తి చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్‌లో పొందుపర్చడం జరిగిందని తెలిపారు. అవసరమైన ఇసుక తెచ్చుకోవడానికి నిబంధనలు సడలించే విధంగా కలెక్టర్‌తో చర్చిస్తామని అన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి పాఠశాలను ఇదే విధంగా పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. పాఠశాల గోడకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని సంబంధిత ఎఇని ఆదేశించారు.

ఆదర్శ పాఠశాలల ప్రారంభానికి మరింత కాలం

హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల ప్రారంభంలో మరింత సమయం పట్టవచ్చని మాధ్యమిక విద్యాశాఖ ముక్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 355 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 110 పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఇంటర్‌ ఫలితాలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న తివారీ ఈ విద్యా సంవత్సరం ఆదర్శపాఠశాలలు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందా అన్న విషయం పై అడిగిన ప్రశ్నకు స్పందించారు. పాఠశాలల నిర్మాణం టెండర్లలో జాప్యం ఇసుక కొరత తదితర కారణాల వల్ల ఆదర్శ పాఠశాలల ప్రారంభం అలస్యమయిందన్నారు. ఈ ఏడాదికి ఈ పాఠశాలలు ప్రారంభించాలా లేదా అనే అంశం పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.



Districts News » Khammam »

మోడల్..!

(సత్తుపల్లి)విద్యారంగ అభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మండలానికో మోడల్ స్కూల్‌ను మంజూరు చేసింది. కానీ స్కూళ్ల ప్రారంభంలో మాత్రం నత్తనడక తప్పడం లేదు. మోడల్ స్కూళ్ళ ఏర్పాటుకు అవసరమైన తొలివిడత నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాని రాష్ట్రంలో పాలన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా 2012-13 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావల్సిన పాఠశాలలు ప్రారంభ అనుమతికి కూడా నోచుకోలేదు. మోడల్ పాఠశాలల ఏర్పాటుకు ఐదెకరాల చొప్పున భూ సేకరణలో అధికారులు మీనమేషాలు లెక్కించడంతో పాఠశాలల స్థాపనకు భూసేకరణ కూడా ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులకు రాష్ట్రప్రభుత్వం మ్యాచ్చింగ్ గ్రాంట్ జమచేసినప్పుడే కేంద్ర నిధులు విడుదలవుతాయి. వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్న కారణంగా ఆదర్శ పాఠశాలలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కొన్ని జిల్లాల్లో తొలివిడత మంజూరైన పాఠశాలల భవనాల నిర్మాణాలు నిధుల కొరతతో ముందుకు సాగడం లేదు. 6వ తరగతితో ఆదర్శ పాఠశాలలు ప్రారంభమై ఆ తరువాత ఒక్కో తరగతి పెంచుతూ పాఠశాల స్థాయిని పెంచాల్సి ఉంది. నిధుల కొరత, పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో భవనాల నిర్మాణాలు వేగంగా సాగని పరిస్థితి నెలకొంది. ఈ విద్యా సంవత్సరంలో ఎటువంటి ఆదర్శ పాఠశాలలు మంజూరు చేయడంలేదని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు కూడా మోడల్ స్కూళ్ల ప్రవేశాలపై ఆశలు పెట్టుకోకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వచ్చే విద్యాసంవత్సరం (2013 -14)లో మండలానికొక ఆదర్శ పాఠశాలను స్థాపిస్థామని రాష్ట్ర ప్రభు త్వం చెప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో...

జిల్లాలో 46 మండలాలకుగానూ పెనుబల్లి, కారేపల్లి మండలాల్లో మా త్రమే మోడల్ స్కూళ్ళు మంజూరయ్యా యి. ఇక్కడ భవనాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మిగిలిన 44 మండలాల్లో ఆదర్శ పాఠశాలల ఊసేలేదు. ఆదర్శ పాఠశాలలకు అవసరమైన స్థలాన్ని సేకరించి నివేదిక పంపాలని గత విద్యాసంవత్సరంలోనే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ స్థల సేకరణ ప్రక్రియ పూర్తికాలేదనే ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో మనజిల్లాలో ఆదర్శ పాఠశాలల మంజూరు, పోస్టుల కల్పనలో నష్టపోయినట్టుగా ఉపాధ్యాయ సంఘాలు చెపుతున్నాయి. ఇతర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో టీచర్ల పోస్టులు మంజూరు అయినప్పటికీ జిల్లాలో రెండు ఆదర్శ పాఠశాలలకు సుమారు 100 పోస్టులు మాత్రమే పొందే అవకాశం ఉంది. జిల్లాలో భూసేకరణ జరగక ఆదర్శ పాఠశాలలు పలు మండలాల్లో మంజూరుకాని పరిస్థితి ఏర్పడింది. కాగా సత్తుపల్లి మండలం సిద్దారం యూపీఎస్ ఆధీనంలో ఉన్న భూమిని ఆదర్శపాఠశాల ఏర్పాటుకు అనుమతిస్తూ అక్కడి పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును గత విద్యా సంవత్సరంలోనే జిల్లా అధికారులకు అందజేసినప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు ఇప్పటి వరకు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వచ్చే విద్యాసంవత్సరం అనుమానమే..
వచ్చే విద్యాసంవత్సరం మండలానికో మోడల్‌స్కూల్ స్థాపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇది అమలయ్యే సూచనలు క నిపించడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి మండలంలో భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది.రియల్ఎస్టేట్, పెరిగిన భూముల రేట్లు, ప్రభుత్వ స్థలా ల ఆక్రమణ, తదితర కారణాల నేపథ్య ంలో ప్రభుత్వ భూమి సేకరించడం అ« దికారులకు తలకు మించిన భారంగా మారింది. ఆదర్శపాఠశాలల ఏర్పాటు కు మండల కేంద్రానికి సమీప గ్రా మాల్లో అయినా భూసేకరణ చేయడం ద్వారా పాఠశాలలు నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్ర భుత్వం దృష్టిసారించి మండల స్థా యిలో అధికారులు చిత్తశుద్ధ్దితో కృషిచే స్తే భూసేకరణ కష్టం కాదని పలువురు వాదిస్తున్నారు.


ఆరంభంలోనే ఆగిన ఆదర్శ పాఠశాలలు


Updated on 22-06-2012 04:41 am By Andhra Voice

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆదర్శ పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి రావడం కష్టమేనని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల తరహాలో ఆంగ్ల మాధ్యమంలో బడులు ప్రారంభిస్తామని విద్యాశాఖ చేసిన ప్రకటన అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీటిపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడక పోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో తొలి విడత కింద 355 ఆదర్శ పాఠశాలల ప్రారంభించాలని మాధ్యమిక విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రం నుంచి రూ.400 కోట్ల నిధులు కూడా వచ్చాయి. పాఠశాలల భవన నిర్మాణాలను ఆలస్యంగా ప్రారంభించడం, గుత్తేదార్ల ఇష్టారాజ్యం, ఇసుక కొరత, తదితర కారణాలతో ఒక్కచోట కూడా ఆదర్శ పాఠశాలలకు భవనాలు సమకూరలేదు. తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడపాలని చూసినా, సాధ్యంకాదని తేలడంతో ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌.ఎం.ఎస్‌.ఎ.) కింద నిర్మించిన అదనపు గదుల్లో వీటిని చేపట్టాలని ప్రయత్నించారు. ఇది కూడా చాలాచోట్ల సాధ్యం కాదని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు. తొలుత ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులను ప్రారంభించాలని మాధ్యమిక విద్యా శాఖ నిర్ణయించినప్పటికీ ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాల కల్పనకు అధిక సమయం పడుతుందన్న ఉద్దేశంతో దానిని ఉపసంహరించుకుంది. ప్రస్తుతం 6,7,8 తరగతులను కూడా ప్రారంభించలేని పరిస్థితుల్లో ఉండటంతో పేర్లు నమోదు చేయించుకున్న విద్యార్థులకు ఏమని సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని నెల్లూరు జిల్లా డీఈవో రామలింగం 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. మరోవైపు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించాలా లేదా అనే అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఉండటంతో అధికారులు సంశయిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో వివిధ స్థాయుల్లో 7100 పోస్టుల భర్తీకి రాతపరీక్షలు జరిగినా వాటి ఫలితాలు వెలువడలేదు. బడుల్ని ప్రారంభించకపోవడంతో ఫలితాల వెల్లడికి అధికారులూ తొందరపడటం లేదు.
ఎలిమెంటరీ స్ధాయిలో మోడల్‌ స్కూళ్లు May 31, 2012 www.suryaa.com
modelహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: ఇప్పటి వరకు రాష్ట్రంలో హైస్కూల్‌ స్థాయిలో మోడల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయడం జరిగింది.ఈస్కూళ్లను రాష్ట్రీయ మా ధ్యమిక శిక్ష అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఎ) పర్యవేక్షిస్తున్నది.వీటిలో 6వ తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి.ఇక నుంచి ఎలిమెంటరీ స్కూల్‌ స్థాయిలో కూడా మోడల్‌ స్కూళ్లుఏర్పాటు చేయడం కోసం ప్రాథమిక విద్యా శాఖ, సర్వశిక్ష అభియాన్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిని 2012-2013 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని భావిస్తున్నారు. జిల్లాకు ఒకటి చొపున ఈ మోడల్‌ స్కూళ్లను ప్రారంభించాలన్నది సర్కారు ఆలోచన. అయితే ఈ మోడల్‌ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేయడం కాదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎలిమెంటరీ స్కూళ్లనే మోడల్‌ స్కూళ్లుగా తీర్చి దిద్దాలనుకున్నారు.

మిగిలిన ఎలిమెంటరీ స్కూళ్ల కంటే ఈ మోడల్‌ స్కూళ్లలో విద్యా బోధన పటిష్టంగా ఉండాలని, ఆ మేరకు మంచి ఫలితాలు సాధించాలన్నది సర్కార్‌ ఉద్దేశ్యం. ఈస్కూళ్లను పర్యవేక్షన పూర్తిస్థాయిలో ఉంటుంది.టీచర్ల రిక్రూట్‌మెంట్‌ విషయంలో కూడా వెనక్కు తగ్గకుండా ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపెై పూర్తి స్తాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విధి విధానాలపెై దృష్టి పెట్టుతామని సర్వ శిక్ష అభియాన్‌ శాఖ అధికారులు చెప్పారు. ఈ స్కూళ్లు మిగిలిన వాటికి రోల్‌మోడల్‌గా పని చేసేలా తీర్చి దిద్దుతామంటున్నారు.

కడప - Andhra Prabha

పూర్తికాని మోడల్‌ స్కూళ్ల నిర్మాణాలు
కెఎన్‌ఎన్‌ ప్రతినిధి  -   Sun, 12 Aug 2012, IST

  • జిల్లాకు 10 పాఠశాలల మంజూరు
  • స్థలాలు ఇచ్చినప్పటికీ పనుల జాప్యం
కడప, ఆగస్టు 11 (కెఎన్‌ఎన్‌ ప్రతినిధి): ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మోడల్‌ స్కూళ్ల (ఆదర్శ పాఠశాలలు) నిర్మాణాలు ఏమాత్రం ముందుకెళ్లడం లేదు. ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేపట్టాలని ప్రభుత్వం మోడల్‌ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. కడప జిల్లాకు సంబంధించి పది పాఠశాలలకు అనుమతిచ్చింది.ఇందులో 9 పాఠశాలలకు స్థలాలు కేటాయించడం జరిగింది. నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పది మోడల్‌ స్కూళ్లలో కనీసం ఒక్క మోడల్‌ స్కూల్‌ నిర్మాణం ఇప్పటి వరకు పూర్తికాలేదు. 2011లో వీటి నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇంకా పనులు పూర్తికాకపోవడం శోచనీయం. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో ఏమాత్రం శ్రద్ద చూపించలేకున్నారు. ఆరవతరగతి నుంచి ఇంటర్‌ వరకుచేర్చుకొని వారికి ఇంగ్లీష్‌ మీడియం సిబిఎస్‌ఇ సిలబస్‌లో బోధన చేపట్టాలన్న మహోన్నత లక్ష్యంతో ఆదర్శపాఠశాలలను ఏర్పాటుచేయనున్నారు. మోడల్‌ స్కూళ్లలో పనిచేసేందుకు గానూ ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆ విషయంగా కూడా ఇక చర్యలు చేపట్టలేదు. ఈ అంశం కోర్టుకు వెళ్లడంతో ఇక నియామకాలు వాయిదా పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. మోడల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం 5 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాల, వసతి గృహాలు నిర్మించారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ కిందవిద్యాపరంగా వెనుకబడిన బ్లాక్‌లను ఎంపికచేసి వాటిలో ఈ పాఠశాలను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.3.02 కోట్లు కేటాయించారు. తొలివిడతగా రాయలసీమలోని 89 బ్లాకులను ఎంపికచేసి బ్లాకుకో పాఠశాల మంజూరుచేశారు. అయితే కర్నూలు జిల్లాకు 36, అనంతపురంకు 25, చిత్తూరుకు 18 మోడల్‌ పాఠశాలలకు కేటాయించగా కడప జిల్లాకు కేవలం 10 మాత్రమే కేటాయించడం జరిగింది. జిల్లాలోని సుండుపల్లె, సంబేపల్లెలో మోడల్‌ స్కూళ్ల నిర్మాణానికి పునాదిరాయి కూడా పడలేదు. ఈ విద్యాసంవత్సరం నుంచే మోడల్‌ స్కూళ్లలో విద్యాబోధన ప్రారంభించాలని చెప్పినప్పటికీ నిర్మాణం ఆలస్యమవుతుండడంతో ప్రభుత్వంవచ్చే యేడాది నుంచి మోడల్‌ స్కూళ్లను ప్రారంభిస్తామని ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరానికైనా మోడల్‌ స్కూళ్ల నిర్మాణం పూర్తిచేస్తే విద్యార్థులకు విద్యాబోధన జరిగే అవకాశం వుంది. ఆదిశగా జిల్లా అధికారులు తగిన చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని చెప్పవచ్చు.


Districts News » Rangareddy »24/12/2012

ఒడిదుడుకుల చదువులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) ఈ సంవత్సరంలో విద్యా పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కొంతమేరకు ఆశాజనకంగానే ఉంది. పదోతరగతిపరీక్షల్లో 83.04 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 8.22 శాతం ఉత్తీర్ణత పెరిగింది. 2011 ఫలితాల్లో 21 స్థానంలో ఉన్న జిల్లా ప్రస్తుత ఫలితాల్లో ఒకస్థానం మెరుగుపడింది. సర్కారీ బడు లు సమస్యల నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిలా ్లలో మొత్తం 2,513 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఉన్నత పాఠశాలలు 478,మరో 9హయ్యర్ సెకండరీ పాఠశాలలు, 1,746 ప్రాథమిక పాఠశాలలు, 280 యూపీఎస్‌సీ పాఠశాలలు ఉన్నాయి.

జిల్లాలో 500 నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలు దాదాపు 60 ఉన్నాయి. సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం లో ఉపాధ్యాయులు లేకపోవడంతో తెలు గు అధ్యాపకులే దిక్కయ్యారు. కంప్యూటర్ విద్య అనేది మిథ్యగానే మారింది. విద్యాహక్కుచట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో విద్యార్థులకనుగుణంగా తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఆట మైదానం, ప్రహారీ, పర్నిచర్, క్రీడాసామాగ్రి, బోధనసామాగ్రి, దుస్తులు తదితర సౌకర్యాలు తప్పకుండా ఉండాలి. కానీ వాటి అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రతీ సంవత్సరం బడిబాట, విద్యా పక్షోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాలో 4,051 మంది బడిఈడు పిల్లలు బయట ఉన్నారు.

చిక్కిపోతున్న సర్కారీ బడులు సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య జిల్లాలో ఏటికేడాది తగ్గిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకం తగ్గిపోవడమే ఈ పరిస్థితికి మూలం. సర్కారీ బడుల్లో కనీస మౌలిక సదుపాయాలు, కంప్యూటర్ విద్యా, ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కూడా ప్రధాన కారణం. చిన్ననాటి నుంచి తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్న తపనతో తల్లిదండ్రులు అధికంగా ప్రయివేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. 2011-12లో ప్రైవేట్ పాఠశాలల్లో 6,54,377 మంది కాగా ప్రభుత్వ పాఠశాలల్లో 3,18,416 మంది మాత్రమే చదువుతున్నారు.

ప్రారంభంకాని ఆదర్శ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూల్స్(ఆదర్శ పాఠశాలలు)ను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో నిర్మిస్తున్న మోడల్ స్కూల్ భవనాల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అన్ని నిర్మాణ దశల్లోను ఉన్నాయి. మరి కొన్ని ఆదర్శపాఠశాలల నిర్మాణానికి స్థలం కేటాయింపుల్లో జాప్యం జరుగుతుండటంతో ఇప్పటివరకు ఎలాంటి పనులూ చేపట్టలేదు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయుల ఎంపికపై ప్రభుత్వం ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ల నియామాకాలపై ఇటీవలనే పరీక్షలు నిర్వహించి, నియకమాలు చేపట్టలేదు. ఇక బోధనేతర సిబ్బంది నియామాకాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీఫికేషన్ వెలువడలేదు.

ఎయిడెడ్ పాఠశాలలపై శీతకన్ను ఎంతో ఉన్నత విలువలతో నెలకొల్పిన ఎయిడెడ్ పాఠశాలలు రోజురోజుకు నిర్వీర్యమవుతున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించాలన్న ఆశయంతో నాడు స్థాపించిన ఎయిడెడ్ పాఠశాలలు నేడు మూతపడే స్థాయి కి చేరుకున్నాయి. జిల్లాలో నెలకొల్పిన పలు ఎయిడెడ్, మిషనరీ పాఠశాల్లో విద్యనభ్యసించిన వారిలో రాజకీయంగా, ఉన్నతాధికారులుగా ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. ఎంతో మంది పేదలకు ఉన్నత విద్యనందించి, వేలాది మందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన పాఠశాలల్లో నేడు కనీస వసతులు కరువయ్యాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులను భర్తీ లేకపోవడంతో విద్యా ప్రమాణాలు దెబ్బతిని మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి.

నాసిరకంగా మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాసిరకంగా తయారు చేస్తుండటంతో పిల్లలు తినేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఒక్కోపాఠశాలల్లో సగం మంది కూడా తినడం లేదు. ఇళ్లల్లోకి వెళ్లి తిని వస్తున్నారు. నిబంధనలు పట్టించుకోవడంలేదన్న విషయం జిల్లా యంత్రాంగం చేపట్టిన తనిఖీల్లో బయటపడింది.

జీఓ 610కి పాతర జీఓ 610కి పాతరేస్తూ ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డిజిల్లాకు ఉపాధ్యాయుల బదిలీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. జిల్లాల్లోని ఉపాధ్యాయులు సాధారణ నిష్పత్తి కంటే దాదాపు 20శాతం స్థానికేతరులు అధికంగా ఉన్న పక్షంలో 610 జీఓను పకడ్బంధీగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఇప్పటికే స్థానికేతరుల నిష్పత్తి 45శాతానికి మించిపోయింది. దీంతో ప్రభుత్వం జిల్లాకు ఏకపక్ష బదిలీలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ, రాష్ట్రపతి ఉత్తర్వులు భిన్నంగా ఇతర జోన్‌ల నుంచి జిల్లాకు ఏకపక్ష అంతర్‌జిల్లా బదిలీలు జరుగుతున్నాయి. ఈ బదిలీలను వ్యతిరేకిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మొత్తం జిల్లాలో స్థానికేతర ఉపాధ్యాయులు దా దాపు 945 మంది ఉన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

తీరనున్న ఉపాధ్యాయుల కొరత డీఎస్సీ 2012 ద్వారా జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొంతమేర కొరత తీరనుంది. జిల్లాలో 2012 డీఎస్సీలో 1,538 ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను నోటీఫై చేసింది. ఉర్దూ మీడియంలో స్కూల్ అసిస్టెంట్లు 21, ఎజ్‌సీటీ 93 పోస్టులు ఉన్నాయి. వీటిలో తెలుగు మీడియంలో 1,424పోస్టులు, ఉర్దూ 144ఉన్నాయి. స్కూల్అసిస్టెంట్ తెలుగు 59 పోస్టులు, హిందీ 23, ఇంగ్లీష్ 50. మ్యాథ్స్87, ఫిజిక్స్ 7, సోషల్ స్టడీస్ 95, బయోసైన్స్ 61 పోస్టులు భర్తీకానున్నాయి. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 16పోస్టులు, భాషా పండితులు తెలుగు 48, హిందీ 38పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వం అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించింది. త్వరలోనే నియామక పత్రాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో 750 మోడల్ స్కూళ్లు
ధర్పల్లి: రాష్ట్ర వ్యాప్తంగా 750 ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్) మంజూ రు కాగా ఈ విద్యా సంవత్సరం 350 ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పాఠశాలల వి ద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) లకా్ష్మడ్డి తెలిపారు. ఆయన ధర్పల్లి మండల కేంద్రంలోని మాలగుట్ట వద్ద చేపట్టిన మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యా రు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మోడల్ స్కూ ళ్లను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ స్కూళ్లు త్వ రలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవన నిర్మాణ పనులు పూర్తి కానందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 6, 7, తరగతుల వారీగా లాటరీ పద్ధతి ద్వారా డ్రా ప్రవేశాలు కల్పించనున్నామన్నారు. కాగా ఇంటర్ ప్రథమ సంవత్సరానికి మాత్రం మెరిట్ ప్రకా రం ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా కు 16 మోడల్ స్కూళ్లు మంజూరు చేయగా ఈ విద్యా సంవత్సరం ఐదు పాఠశాలలు ప్రా రంభించనున్నట్లు చె ప్పారు. మోడల్ స్కూల్లో సీబీఎస్‌ఈ సిలబస్ కాకుండా రాష్ట్ర పాఠ్యాంశాల బోధనే ఉంటుందని ఆయన వివరించారు.


ఏపిలో 737 మోడల్ స్కూల్స్

న్యూఢిల్లీ: విద్యా విషయంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో 3,500 ఆదర్శ పాఠశాలలను (మోడల్ స్కూల్స్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11వ పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వార్డ్ బ్లాక్స్ (ఈబిబి) వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ మోడల్ స్కూల్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 737 స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాల్లోని అకాడమిక్, మౌలిక సదుపాయల ప్రమాణాలన్నీ కేంద్రీయ విద్యాలయాల తీరులో రూపొందిస్తారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 702 మోడల్ స్కూళ్లను, బీహార్లో 530, ఝార్ఘండ్ 203, మద్యప్రదేశ్ 201, రాజస్తాన్ 186, ఒరిస్సా 173, జమ్మూ-కాశ్మీర్ 97 మోడల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విద్యలో అత్యంత పురోగతి సాధించిన కేరళలో ఒకే ఒక మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నారు. 6 వేల మోడల్ స్కూళ్ల ఏర్పాటు గాను 2009-10 మధ్యంతర బడ్జెట్లో ఉపా ప్రభుత్వం దాదాపు 312 కోట్ల రూపాయలను కేటాయించింది. వాటిలో ప్రభుత్వం కేవలం 3,500 స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేసి నడుపుతుంది, మిగిలిన 2,500 స్కూళ్లను ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్య పద్ధతిలో (పిపిపి) ఏర్పాటు చేస్తారు.

ఈ స్కూల్ ను ఏర్పాటు చేసే ప్రాంతం, క్లాస్ రూమ్ విస్తీర్ణం, ఆట స్థలం, గ్రంథాలయం, వైద్య పరీక్షల కేంద్రం, ఉపాధ్యాయుల శిక్షణ ల్లాంటి పలు అంశాలన్నిటిలో కేంద్రీయ విద్యాలయాల నిబంధనలను అనుసరించి ఈ స్కూళ్లను తీర్చి దిద్దుతారు. ఉపాధ్యాయుడు-విద్యార్ధుల నిష్పత్తిని 1:40 గా నిర్ణయించారు. ఈ మోడల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్వహిస్తాయి. అయితే కేంద్రం ఒక్కొక్క స్కూల్ కు 4 కోట్ల రూపాయల నిధిని అందజేస్తుంది. అయితే ఈ స్కూళ్లు సిబిఎస్ఈని గాని స్టేట్ బోర్డులను గాని అనుసరించవచ్చు. ఈ స్కూళ్లలో చేరే విద్యార్ధులను సర్వ శిక్ష అభియాన్ ద్వారా పెద్ద సంఖ్యలో తీసుకోవడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రాథమిక విద్యలో దాదాపు 97 శాతం నమోదు జరుగతోంది. అదే సెకండరీ విద్యలో 52 శాతం మాత్రమే ఎన్ రోల్ మెంట్ ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే పిపిపి పద్దతి అమలుకు ప్లానింగ్ కమీషన్ అనుమతి కోసం చూస్తున్నారు. 


మోడల్ స్కూళ్లు, హాస్టళ్లకు రూ.28 కోట్లు by Namaste Telangana
పరిగి,(టీ మీడియా): పరిగి నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లో మోడల్ స్కూళ్లు, బాలికల హాస్టళ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.28 కోట్లు మంజూరయ్యాయని టీఆర్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్, అసైన్‌మెంట్ కమిటీ సభ్యుడు టి.రాంమోహన్‌డ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో మోడల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని, పనులు కొనసాగుతున్నాయన్నారు. బాలికల హాస్టళ్ల నిర్మాణానానికి ఒక్కోదానికి రూ.1.30 కోట్లు చొప్పున మంజూరైనట్లు తెలిపారు.

బాలుర హాస్టళ్ల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరవనున్నాయన్నారు. ఈనెల 4న హోం మంత్రి సబితాడ్డి పలు అభివృద్ధ్ది కార్యక్షికమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తార ని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.40 గంటలకు గండీడ్‌లో పోలీసు ఔట్‌పోస్టును మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం వెన్నాచేడ్‌లో హాస్టల్ భవనానికి శంకుస్థాపన, దోమ మండలం ఎల్లాడ్డిపల్లిలో ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకుకు శంకుస్థాపన, పరిగి మండలం జాఫర్‌పల్లిలో, పూడూరు మండలం ఎన్కెపల్లిలో బాలికల హాస్టల్ భవనానికి, పూడూరులో కస్తూర్బాగాంధీ పాఠశాల భవనం ప్రారంభోత్సవం చేస్తారని పేర్కొన్నారు. పరిగిలో జరిగే భూ పంపిణీ కార్యక్షికమంలో 269 మంది లబ్ధ్దిదారులకు 305.14 ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు. ఈ నెలలో జిల్లాలో జరిగే ఇందిరమ్మబాట కార్యక్షికమంలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌డ్డి పరిగి మండలం మాదారం సమీపంలో 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు. విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఒకరోజు రాత్రి బస చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్షికమంలో కాంగ్రెస్ నాయకులు బి.నారాయణడ్డి, దండు అశోక్, నర్సింహరావు, జమీల్, చిట్యాల్ మాజీ సర్పంచ్ నర్సింహులు, గుండాల్ ప్రభాకర్‌డ్డి పాల్గొన్నారు.

నల్గొండ Andhra Prabha

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల్లో దడ భయపెడుతున్న మోడల్‌ స్కూళ్లు

కెఎన్‌ఎన్‌ -   Tue, 3 Jul 2012, IST


(కెఎన్‌ఎన్‌ బ్యూరో/ నల్గొండ)
జిల్లాలోని ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలలో మోడల్‌ స్కూళ్లు దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది మోడల్‌ స్కూళ్లను ప్రారంభించాలనే నిర్ణయాన్ని గతంలోనే ప్రభుత్వం తీసుకున్నప్పటికీ స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన భవనాల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో వచ్చే ఏడాది నుంచి జిల్లాలో మోడల్‌ స్కూళ్లను ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తాజాగా తీసుకుంది. దీంతో జిల్లాలోని ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు కొంత ఊరట చెందాయి. జిల్లాలో మోడల్‌ స్కూళ్లను గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం విదితమే. జిల్లాలోని సుమారు వెయ్యికి పైగా ఉన్న ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులే అధిక సంఖ్యలో విద్యనభ్యసిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివించేందుకే ఆసక్తిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇందు కోసం ఏటా వేలాది రూపాయలను పిల్లల ఫీజుల రూపంలో ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలలకు చెల్లిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఛార్జీల రూపంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలోని 44 మండలాలలో ఇంగ్లీష్‌ మీడియం మోడల్‌ స్కూళ్లను అన్ని హంగులతో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన చర్యలను తీసుకోవడంలో నిమగ్నమైంది. జిల్లాకు మొదటి దఫాగా 33, రెండవ దఫాగా 11 మోడల్‌ స్కూళ్లు మంజూరయ్యాయి. ఆయా మోడల్‌ సూళ్లకు అవసరమైన భవనాల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మోడల్‌ స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ భవన నిర్మాణ సముదాయాలు పూర్తి కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్‌ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు ఇటీవల సంబంధిత శాఖా మంత్రి ప్రకటించడం విదితమే. అయితే ఈ ఏడాదే మోడల్‌ స్కూళ్లను ప్రారంభించాలనే యోచనతో ప్రభుత్వం విద్యార్థుల నుంచి 6,7, 8 తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 18,600 దరఖాస్తులు విద్యార్థుల నుంచి విద్యా శాఖ అధికారులకు అందాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో అత్యధిక మంది ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అసలే పాఠశాలల నిర్వహణ రాను రాను ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో పాఠశాలల్లోని విద్యార్థుల సం ఖ్య మోడల్‌ స్కూళ్ల కారణంగా తగ్గుముఖం పడితే తమ పరిస్ధితి ఏమిటనే విషయమై యాజమాన్యాలు మల్లగుల్లలు పడుతున్నాయి. మోడల్‌ స్కూళ్లలో విద్యార్థులకు సీటు లభిస్తే ఏటా విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేసే డబ్బు మిగులుతుందనే యోచన తల్లిదండ్రులలో ఇప్పటికే నాటుకుపోవడంతో ఎలాగైనా మోడల్‌ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించాలనే పట్టుదలతో తల్లిదండ్రులు ఉన్నారు. అంతే కాకుండా సకల హంగులతో కార్పోరేట్‌ స్ధాయిలో ఏర్పాటు కానున్న మోడల్‌ స్కూళ్లలో నాణ్యమైన విద్య విద్యార్థులకు అందనుందనే యోచన కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ చూపును మోడల్‌ స్కూళ్ల వైపు సారిస్తున్నారు. మోడల్‌ స్కూళ్లు ప్రారంభమైతే ప్రైవేట్‌ పాఠశాలల మనుగడకు ప్రమాదం తప్పదనే అభిప్రాయం పాఠశాలల యాజమాన్యాల నుంచి వినిపిస్తుంది. మొత్తం మీద వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న మోడల్‌ స్కూళ్లు ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాల్లో దడ పుట్టిస్తున్నాయి.




 

 

 

 

News clipping in Eenadu Dist Rural edition dated 13 Feb 2013

 



లాటరీతో అడ్మిషన్లు - మోడల్ స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ

రాష్ట్రంలో ప్రారంభంకానున్న మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. విద్యాహక్కు చట్టానికి లోబడే అడ్మిషన్లు చేపట్లే ఈ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది. కో ఎడ్యుకేషన్‌తోపాటు స్టేట్ సిలబస్‌ను అమలు చేస్తారు. ఈ మేరకు మాథ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి సోమవారం ఉత్తర్వులు (జీవో నెం. 17) జారీ చేశారు. దీని ప్రకారం రాబోయే 2013-14 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో విద్యా పరంగా వెనుకబడిన 355 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమవుతాయి.
ప్రతి మోడల్ స్కూల్‌లోనూ ఈసారి 6,7,8 తరగతులు, ఇంటర్ తొలి ఏడాది అడ్మిషన్లు మాత్రమే జరుగుతాయి. 6,7,8 తరగతుల్లో రెండేసి సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 40 మంది చొప్పున విద్యార్థులనుచేర్చుకుంటారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ,బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 20సీట్ల చొప్పున ఉంటాయి. 2015-16లో పదో తరగతి ఉంటుంది. సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లు ఉంటాయి. 


కాగా, 6,7,8 తరగతుల్లో అడ్మిషన్లకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంఘం(ఏపీఆర్ఈఐఎస్) అనుసరిస్తున్న పద్ధతినే అనుసరిస్తారు. అంటే లాటరీ పద్ధతి(లాట్ల డ్రా)లో ప్రవేశాలు జరుగుతాయన్నమాట. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు మాత్రం పదో తరగతి మార్కుల మెరిట్ ప్రాతిపదికన చేపడతారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 3శాతం, బాలికలకు 33.33శాతం సీట్లు రిజర్వు చేస్తారు. 



అడ్మిషన్ విధానం

* రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) నోటిఫికేషన్ జారీ చేస్తుంది 

* మండల విద్యాధికారి(ఎంఈఓ) కార్యాలయాల్లో దరఖాస్తులను ఉచితంగా తీసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయి. వీటిని ఆయా మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు స్వీకరిస్తారు. వాటిని 'సెలెక్షన్ కమిటీ'కి పంపిస్తారు 

* విద్యార్థుల ఎంపిక కోసం ఏర్పాటయ్యే సెలెక్షన్ కమిటీకి ఆయా జిల్లాల్లోని అడిషనల్ జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా డీఈవో, ఇంటర్ బోర్డు ఆర్ఐవో డిప్యూటీ ఈవో(ఆర్ఎంఎస్ఏ), ఏపీఆర్ఈఐఎస్/ఏపీఎస్‌డబ్ల్యుఈఆర్ఐఎస్/ఏపీటిడబ్ల్యుఆర్ఈఐఎస్‌ల నుంచి ఒక ప్రిన్సిపాల్ (జిల్లా కలెక్టర్ నామినేట్ చేస్తారు), సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్ ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా సంబంధిత జిల్లాలోని ఒక మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్(జిల్లా కలెక్టర్ నామినేట్ చేస్తారు) ఉంటారు 

* తల్లిదండ్రులు/ప్రజాప్రతినిధుల సమక్షంలో అడ్మిషన్లకు సంబంధించిన డ్రా తీయాలి 

* సంబంధిత మండలంలో విద్యార్థులు లేక మిగిలిన సీట్లను ఇతర మండలాల విద్యార్థులకు కేటాయిస్తారు 

* డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో, స్కూలు ప్రాంగణాల్లో సెలెక్షన్ లిస్టు, వెయిటింగ్ లిస్టును పెడతారు 

* 80 మంది విద్యార్థులున్న తరగతిలో 5 శాతం/స్కూలుకు మంజూరైన సంఖ్యలో 20 సీట్లకు మించకుండా జిల్లా కలెక్టర్ సంబంధిత మోడల్ స్కూళ్లలోని రెగ్యులర్ ఉద్యోగుల పిల్లలకు మంజూరు చేయవచ్చు 

* అడ్మిషన్లకు సంబంధించిన వివాదాలపై జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్‌దే తుది నిర్ణయం





ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం ప్రవేశాలకు విధి విధానాలు ఖరారు

కెఎన్‌ఎన్‌  -   Mon, 4 Feb 2013, IST

కడప, ఫిబ్రవరి 3 (కెఎన్‌ఎన్‌ బ్యూరో):
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన విధి విధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది. దీంతో ఆదర్శపాఠశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఈ నెల 3వవారం నాటికి ప్రవేశాల ప్రకటన వెలువడే అవకాశం వుంది. మార్చిలోగా అధ్యాపకుల నియామకాల ప్రక్రియను విద్యాశాఖ పూర్తి చేయనుంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల తరహాలో ఇంగ్లీష్‌ మీడియంలో ఆధునిక సౌకర్యాల మధ్య ఆదర్శ పాఠశాలల్లో బోధన జరగనుంది. 2013, 14 విద్యాసంవత్సరంలో 6, 7, 8 తరగతులను విద్యాశాఖ ప్రారంభించనుంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులను నిర్వహించనున్నారు. 6 నుంచి 8వతరగతి వరకు ఒక్కొక్క తరగతిలో రెండేసి సెక్షన్‌ల ప్రకారం40మంది వంతున విద్యార్థులకు ప్రవెెశం కల్పిస్తారు. విద్యాహక్కు చట్టం మేరకు తరగతుల సీట్లను లాటరీ ద్వారా భర్తీచేస్తారు. సామాజిక వర్గాల వారీగా సీట్ల భర్తీ జరుగుతుంది. ప్రవేశాలలో తొలుత సంబంధిత మండలాలకు చెందిన ప్రాధాన్యత ఇస్తారు. సీట్లు మిగిలితే సంబంధిత మండలంలో విద్యార్థులు లేరని నిర్ధారించుకున్నాక మిగిలిన మండలాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఇంటర్‌ ప్రధమ సంవత్సరంలో ఎంపిసి, బైెపిసి, ఎంఇసి, సిఇసి కోర్సులను నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకు 20మంది వంతున విద్యార్థులను చేర్చుకుంటారు. పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సాధించిన గ్రేడ్‌ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. 2013, 14 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలలో 6, 7, 8, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి కలిపి 320 మంది విద్యార్థులకు బోధన ఇస్తారు. ప్రవేశాల ప్రక్రియ జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో జరిగేలా నిబంధనలు ఖరారు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ జరుగుతుంది. విద్యాహక్కు చట్టం మేరకు ప్రాధమిక విద్యలో ప్రవేశించే వారి నుంచి రుసుం వసూలు చేయాలి. ప్రభుత్వ కళాశాలల మాదిరిగానే జూనియర్‌ ఇంటర్‌లోచేరేవారు రుసుం చెల్లించాల్సి వుంటుంది. ఏది ఏమైనా ఆదర్శ పాఠశాలలు ప్రారంభించేందుకు వీలుగా ప్రవేశాలకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొందని చెప్పడంలో సందేహం లేదు.







నందవరంలోనే మోడల్ స్కూల్ by Andhra Bhoomi

  • 23/10/2012
నెల్లూరు, అక్టోబర్ 22: మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోనే మోడల్ స్కూల్ ప్రారంభించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైతే కలెక్టర్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. ఈ విషయమై వాళ్లు (మేకపాటి వర్గీయులు) కోర్టును ఆశ్రయించారంటూ కూడా మంత్రి ఇదే సందర్భంలో పేర్కొనడం గమనార్హం. మర్రిపాడు మండలంలో మోడల్ స్కూల్ ఏర్పాటు వ్యవహారంలో ఇటు మంత్రి ఆనంకు, అటు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డికి మధ్య రాజకీయంగా ప్రతిష్ఠాత్మకం కావడం విదితమే. ఇదే మండలంలో ఉన్న మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో మోడల్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి తొలుత మంజూరు ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో ఆనం, మేకపాటి వర్గాలు కాంగ్రెస్‌పార్లీటో కలసి మెలసి కొనసాగడంతో బ్రాహ్మణపల్లిలో మోడల్ స్కూల్ ఏర్పాటయ్యేందుకు తొలుత అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్సే రెండు ముక్కలుగా విడిపోవడంతోపాటు ఆనం, మేకపాటి వర్గాల నడుమ వైరం ఏర్పడటంతో మోడల్ స్కూల్ ప్రతిపాదనలు మారిపోయాయి. అధికారపార్టీ హోదాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ స్కూల్‌ను ఇదే మండలంలోని నందవరం వద్దకు మార్చేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేగాక నందవరం వద్ద మోడల్‌స్కూల్ నిర్మాణానికి సంబంధించి అధికారికంగా శంఖుస్థాపన కూడా చేశారు. దీంతో ఆగ్రహించిన మేకపాటి వర్గీయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం ఆత్మకూరు మండలం కరటంపాడు పంచాయతీ మాజీ సర్పంచ్ గార్లపాటి వేణుగోపాలనాయుడు నివాసానికి వచ్చారు. గార్లపాటి తల్లి ఇటీవల మృతి చెందడంతో పరామర్శించే నిమిత్తం వచ్చిన మంత్రి స్థానిక విలేఖర్లతో ఇష్టాగోష్టిగా పై వివరాలు తెలిపారు. జిల్లాలోని పది మండలాల్లో మోడల్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయన్నారు








ఆదర్శం హుష్‌కాకి..! by Namaste Telangana


- 31 ఆదర్శ పాఠశాలలను జారవిడిచిన జిల్లా అధికారులు
- పట్టించుకోని పెద్దసారు..
- వెనక్కివెళ్లిన రూ. 155 కోట్ల నిధులు
- 620 పోస్టులకూ చెల్లుచీటి
- వెంటాడుతున్న ‘సక్సెస్’ భయం
- మిథ్యగా మారిన మోడల్ విద్య


- టీన్యూస్ ప్రతినిధి, ఖమ్మం:ఓ వ్యక్తిగా మంచి పని చేసే అవకాశం వస్తే మనం ఏంచేస్తాం..? మారుమాట్లాడకుండా టక్కున చేసేస్తాం. అదీ పది మందికి ఉపయోగపడేదైతే.. దానికోసం ఎంతకైనా శ్రమిస్తాం. విజయాన్ని పిడికిట పట్టేదాక వదలం. దాని ఫలాలను భావితరాలకు అందించే ప్రయత్నమూ చేస్తాం. మరి ప్రభుత్వ కొలువులు చేస్తూ శక్తులుగా మారిన వారు.. ఏంచేశారో తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం. జనం బాగోగులు పట్టించుకోవాల్సిన అధికారులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరకుండా చేస్తున్నారనడానికి నిదర్శనమిది.

రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కింద మొదటి విడతగా జిల్లాలోని 33 మండలాల్లో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసి మాధ్యమిక విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. నిధులు మంజూరు చేసి... 620 ఉద్యోగాలకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘ప్రభుత్వ స్థలాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించుకోండి’ అనికూడా సూచించింది. మరి అధికారులు ఏంచేశారు..? స్థలాలను వెతికారా..? భవనాలు నిర్మిస్తున్నారా..? వచ్చిన నిధులతో పనులు ప్రారంభించారా..? మన ఉద్యోగాలు మనకు దక్కేలా చర్యలు తీసుకున్నారా..? ఇంతకీ ఏం జరిగింది..!!
ఒక్కమాటలో.. విషం చిమ్మారు.. భవనాలు, నిధులు, ఉద్యోగాలు హుష్‌కాకి అనిపించారు.


టీన్యూస్ ప్రతినిధి, ఖమ్మం:అందివచ్చిన అవకాశాన్ని జారవిడిచిన జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు దగా పడిన వైనమిది. ఇప్పటివరకు రాష్ట్రంలో నాణ్యమైన ఇంటర్ విద్యను అందించటమనేది ప్రైవేట్ రంగం గుత్తాధిపత్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో మాధ్యమిక (6వ తరగతినుంచి ఇంటర్ వరకు) విద్యను ప్రైవేటుకు ధీటుగా అందించేందుకు నిర్ణయించింది.

దీనిలో భాగంగా జిల్లాలో వెనుకబడిన మండలాలను ఎంపిక చేసి వాటిలో మండలానికొకటి చొప్పున సకల సదుపాయాలతో ఆదర్శ పాఠశాలలను నెలకొల్పేందుకు సంకల్పించింది. వచ్చే జూన్‌నెలలో ప్రారంభకానున్న ఈ పాఠశాలలకు ఆదిలోనే హంసపాదు పడింది.


ఆదర్శ పాఠశాలలు మంజూరైన మండలాలు
కేంద్ర ప్రభుత్వం రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఎ) కింద మొదటి దశ లో భాగంగా జిల్లాలోని వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించిన 33 మండలాలను మోడల్ స్కూళ్ల ఏర్పాటు కోసం ఎంపిక చేశారు. వీటిలో మండలానికొకటి చొప్పున మంజూరు చేశారు. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, గుండాల, తిరుమలాయపాలెం, పెనుబల్లి, కారేపల్లి, కూసుమంచి, బోనకల్, ఎర్రుపాలెం, ఏన్కూరు, చింతకాని, జూలూరుపాడు, గార్ల, కామేపల్లి, కొణిజర్ల, ముదిగొండ, బయ్యారం, చండ్రుగొండ, ములకలపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, వాజేడు, వెంకటాపురం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం, చింతూరు, వీఆర్.పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. ఈ పాఠశాలలకు భవనాల నిర్మాణానికి ప్రతీ మండల కేంద్ర సమీపంలోని అనువైన ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని ఆర్‌ఎంఎస్‌ఎ కు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత ఎంఈఓల సమన్వయంతో స్థలాన్ని ఎంపిక చేయాలి. అయితే జిల్లాలో ఎర్రుపాలెం, పెనుబల్లి, సింగరేణి( కారేపల్లి), వేలేరుపాడులలో మాత్రమే పాఠశాలలకు కావలసిన భూమి లభ్యమైందని విద్యాశాఖకు ఆయా మండలాల తహసీల్దార్లు నివేదించారు.దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు రెండింటి వివరాలనే ఉన్నతాధికారులకు పంపడంతో కేవలం పెనుబల్లి, కారేపల్లి మండలాలకు మాత్రమే స్కూళ్లు మంజూరయ్యాయి.


ప్రభుత్వ స్థలాలున్నా కొరవడిన చిత్తశుద్ధి..
ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని ఖానాపురం, బూడిదంపాడు, చింతగుర్తి, మంచుకొండ, మల్లేపల్లి గ్రామాల్లో ప్రభుత్వభూమి ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో ఏదులాపురం, పోలేపల్లి, వెంకటగిరి, గుదిమళ్ళ, పెద్దతండా, మల్లెమడుగు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ములకలపల్లిలో సర్వే నెంబర్ 415లో గ్రామ పంచాయతీకి చెందిన 15 ఎకరాల భూమి ఉంది. చండ్రుగొండ మండల కేంద్రంలో సుమారు 1300 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. దాదాపు ప్రతి మండలంలోనూ ప్రభుత్వ భూమి లభ్యతకు కొరతలేదు.

పైగా ఆ భవనాల నిర్మాణానికి ఎటువంటి భూమినైనా చూపవచ్చని ప్రభుత్వం పేర్కొంది. గత నవంబర్ ప్రారంభం నాటికి స్థల సేకరణ పూర్తి చేసి ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నాటికి నిర్మాణం పూర్తయిన భవనాలలో ఆదర్శ పాఠశాలలు ప్రారంభించాల్సి ఉంది. అయితే అనుకున్న ప్రకారం రెవెన్యూ సిబ్బంది స్థల సేకరణ చేపట్టక పోవటంతో ఈ విషయాన్ని పత్రికలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చాయి.

దీంతో ఆయన నవంబర్ నెలాఖరునాటికి స్థల సేకరణ చేయాలని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం దానిగురించి పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడం.. అజమాయిషీ కొరవడటంతో స్థల సేకరణ జరగలేదు. కేవలం రెండు మండలాల గురించి మాత్రమే ఉన్నతాధికారులకు నివేదించటంతో ప్రస్తుతం రెండు మాత్రమే మంజూరయ్యాయి.


620పోస్టులూ దక్కకుండా పోయినయ్..
ఆర్‌ఎంఎస్‌ఎ కింద మంజూరైన ప్రతీ మోడల్ స్కూల్‌కు ఒక ప్రిన్సిపాల్‌తోపాటు తెలుగు, ఆంగ్లం, గణితంలలో రెండేసి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌లలో తలా ఒకటి చొప్పున 13పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులుంటాయి. వీటితోపాటు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో తలా ఒక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ లెక్కవూపకారం జిల్లాకు మంజూరైన 33మోడల్ స్కూళ్లకు ప్రిన్సిపాల్ పోస్టులు సహా 429 పీజీటీ, 19 టీజీటీ పోస్టులు రావల్సి ఉంది.

అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు 31మోడల్ స్కూళ్లు అర్ధంతరంగా ఆగిపోవడంతో మొత్తం 620 పోస్టులు చరమగీతం పాడినట్లయింది. కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ 13న జారీ చేసిన ఉత్తర్వులలో దేశంలో 6000, రాష్ట్రంలో 355 వీటిలో ఖమ్మం జిల్లాకు 2మోడల్ స్కూల్స్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్ల నిర్వహణ కోసం రూ. 412.09 కోట్లు మంజూరు చేసింది. వాస్తవం ఇలా ఉండగా జిల్లా అధికారులు మాత్రం మోడల్ స్కూళ్ల ఏర్పాటు కోసం శ్రమిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు చెబుతూ రావటం గమనార్హం. మోడల్ స్కూళ్ల నిర్వహణ కోసం ఇన్‌వూఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కమిటీ, అకడమిక్ డెవలప్‌మెంట్ కమిటీ పేరుతో రెండు కమిటీలను వివిధ స్థాయిలలో ఏర్పాటు చేయటానికి మార్గదర్శకాలను విడుదల చేసింది.

అంతేకాకుండా ఈ పాఠశాలల కోసం 7100 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. 5074 పాలనాపరమైన పోస్టులను డిప్యూ ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 19 కేటగిరీలకు చెందిన 39 పోస్టుల ను రాష్ట్ర స్థాయిలోనూ, 4 కేటగిరీలకు చెందిన 5 పోస్టుల ను జిల్లా స్థాయిలోనూ డిప్యూ నియమించాలని ఉత్తర్వులిచ్చింది. అయితే ఉపాధ్యాయ పోస్టులు మాత్రం జోనల్ స్థాయివి కావటంతో ఖమ్మం జిల్లాకు మంజూరూ కావలసిన 620 పోస్టులు రాకపోవటంతో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఖమ్మం జిల్లాలో కూడిన జోన్ స్థాయి లో నిరుద్యోగ అభ్యర్థులందరికీ అశనిపాతంగా మారింది.


ఎందుకీ ఆదర్శ పాఠశాలలు?
పలు విద్యా కమిషన్ల సిఫారసులు, విద్యా వేత్తల వేడుకోలను ఆలకించిన కేంద్ర ప్రభుత్వం 15 సవంవత్సరాలుగా ప్రాథమిక విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. దీనిలో భాగంగా ‘జిల్లా ప్రాథమిక విద్యా పథకం’ (డిపెప్), ‘సర్వశిక్షా అభియాన్’ (ఎస్‌ఎస్‌ఏ), ‘రాజీవ్ విద్యా మిషన్’ (ఆర్‌వీఎం) లను అమలు చేసింది. ఈ అభివృధ్ధికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులతో మాధ్యమిక విద్యను పటిష్టం చేసేందుకు సమాయత్తమైంది. ప్రస్తుతం ఆర్‌వీఎం అమలుకాలం ముగిసింది.

దీని స్థానంలో కేంద్రం ‘రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్’ను ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో 1-5 తరగతులను ప్రాథమిక విద్యగా.. 6-10 తరగతులను సెకండరీ విద్యగా ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు, పలు రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లోనూ 6 నుంచి 12 వ తరగతి వరకు( మన రాష్ట్రంలో ఇంటర్‌మీడియెట్) సెకండరీ విద్యగా అమలు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో భౌతిక వనరులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ బోధన మాత్రం స్టేట్ సిలబస్‌లోనే సాగుతుండటం విశేషం. ఒక్కొక్క పాఠశాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయించారు. ఇంతటి ప్రాముఖ్యం కల ఈ పాఠశాలల ఏర్పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, బడుగు, బలహీన వర్గాలకు కార్పొరేట్ విద్య నందించే సువర్ణావకాశాన్ని మనం వదులుకోవడం విచారకరం.


వెంటాడుతున్న ‘సక్సెస్’ 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి మానస పుత్రికగా విపరీత ప్రచారం పొందిన సక్సెస్ పాఠశాలలు నేడు దీనస్థితిలో నడుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో నిర్వహించే ఈ పాఠశాలలకు సంవత్సరానికి రూ. 2కోట్లు చొప్పున ఐదేళ్ళలో రూ. 10కోట్లు వెచ్చించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు నివాసం, వసతి, మౌలిక వనరులు కల్పిస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఆచరణలో మాత్రం ఆ పాఠశాలకు ఒక్కరూపాయి కూడా విదల్చలేదు. కనీసం ఉపాధ్యాయులను సైతం నియమించలేదు.

తెలుగు మీడియంలో చెప్పే ప్రస్తుత ఉపాధ్యాయులను ఆంగ్ల మాధ్యమం బోధించడంటూ అధికారులు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. జాతీయస్థాయిలో వివిధ ఉమ్మ డి ప్రవేశ పరీక్షలు నిర్వహించటానికి కసరత్తులు పూర్తవుతున్న ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పనున్న ఈ మోడల్ స్కూళ్ల వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తల్లిదంవూడులు అభివూపాయ పడుతున్నారు.


నెరవేరని సీఎం హామీ....
రచ్చబండ కార్యక్షికమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి గత నవంబర్‌లో జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చింతకాని మండలం రామకృష్ణాపురంలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ జిల్లాకు 33మోడల్ స్కూళ్లు మంజూరైనట్లు ప్రకటించారు. వీటి ఏర్పాటుపై ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ జిల్లాలో రె యంత్రాంగంలో కదలిక లేకపోవటంతో 31మోడల్ స్కూళ్లు జిల్లాకు ప్రస్తుతం రాకుండా పోయాయి. ఈ విషయంలో వాస్తవస్థితి, స్థలసేకరణలో ఇబ్బందులను తహసీల్దార్లు, మండల విద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురావటంలోనూ విఫలమయ్యారు.


మరి పెద్దసారు ఏమంటారో..?
విద్యాశాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టితో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటానంటున్న పెద్దసారు, తన శాఖ నిర్ల క్ష్యం కారణంగా జిల్లాలో విద్యాభివృద్ధికి విఘాతం ఎర్పడినా, తన ఆదేశాలను తన శాఖ వారే పట్టించుకోకపోయి నా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం విచారకరం.ఇతర శాఖలకు చెందిన అధికారులపై ఏ చిన్న త ప్పు చేసినా కొరడా ఝులిపించే పెద్దసారు ఈ విషయమై అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం విశేషం. బడుగు వర్గాలకు అత్యుత్తమమైన విద్యను అందించే అవకాశాలను దూరం చేయటం, నిరుద్యోగులకు పోస్టులు రాకుండా పోవటానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోకపోవటంవల్ల వారికి ఊతమిచ్చినట్లవుతుందని విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదర్శం నత్తనడక
- ఆదర్శ పాఠశాలలకు బాలారిష్టాలు
- ముందుకుసాగని భవన నిర్మాణాలు
- ఇసుక కొరతతో మరింత ఆలస్యం
- నిర్మాణ వ్యయం పెరగడం మరో కారణం
- వచ్చే నెల ప్రారంభంపై నీలినీడలు
జిల్లాలో ఆదర్శ పాఠశాలల (మోడల్‌స్కూల్స్)పై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలివిడత కింద ఎంపికైన 14 మండలాల్లో భవనాలను జూన్ రెండో వారం నుంచి ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణాలు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. రెట్టింపైన ముడిసరుకుల ధరలు, ఇసుక కొరతతో నిర్మాణ వ్యయం పెరిగి కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తుండగా, నిర్ణీత సమయంలో ఏ ఒక్క దాంట్లోనూ తరగతులను ఆరంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే విద్యార్థుల పేర్లను నమోదు చేస్తుండగా, అధికారుల్లో కలవరం మొదలైంది.
(టీ న్యూస్, ఆదిలాబాద్)
‘ప్రస్థుతం మార్కెట్లో ఉన్న ఇసుక కొరతను అధిగమిస్తే ఆదర్శపా నిర్మాణ పనులు వేగవంతం చేయొచ్చు. రాష్ట్రంలో తొలివిడత మంజూరయిన 355 ఆదర్శపా నిర్మాణం కోసం 45 వేల లారీల ఇసుక అవసరమనే విషయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి దృ ష్టికి తీసుకెళ్లాం. వచ్చేనెల కాకపోయినా సాధ్యమై నంత త్వరగా ఆదర్శపా నిర్మాణా లు పూర్తిచేసి తరగతులు నిర్వహిస్తాం.’
- పాఠశాల విద్యాశాఖ
ముఖ్యకార్యదర్శి రాజేష్ తివారి
వచ్చేనెలలో ప్రారంభమవ్వాల్సిన ఆదర్శపా నీలినీడలు ఆవహించనట్లు అర్థమవుతోంది. పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమ య్యే అవకాశాలున్నాయని స్వయానా విద్యాశా ఖ ముఖ్యకార్యదర్శి రాజేష్ తివారి ప్రకటించడం తో జిల్లాలో ఈపా పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వచ్చే నెల రెండో వారం నుంచి ఆదర్శ పాఠశాలలు ప్రారంభమవాల్సి ఉంది. ఓవైపు ఈ పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కోసం విద్యార్థుల పేర్లను న మోదు చేస్తుండగా, మరోవైపు భవన నిర్మాణా లు ముందుకు సాగకపోవడంతో మొత్తం విద్యావ్యవస్థకే మచ్చవచ్చేలా కనిపిస్తోంది. జిల్లాలో ఆదర్శపా నిర్మాణాలు మందకొడిగా సా గుతున్న కారణంగా అటు ఉపాధ్యాయ నియామకాల్లో సైతం జాప్యం జరుగుతోంది. నవోద య, కేంద్రీయ విద్యాలయాల తరహాలో ఆదర్శ పాఠశాలల నిర్వహణ జరిగేలా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కేంద్రం నుంచికూడా భారీగా నిధుల వరద ఉన్నట్లు తెలుస్తోం ది.

జిల్లాలో తొలివిడత కింద విద్యాపరంగా వె నుకబడిన మండలాల్లో 14 ఆదర్శ పాఠశాలల ను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు ని ర్ణయించారు. అందుకు తగినట్లుగా భవననిర్మా ణ పనులు మాత్రం జరగడంలేదు. దీనికి తోడు ఇసుకపై సుప్రీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆం క్షలు విధించడంతో పరిస్థితి మరీ ఇరుకునపడిం ది. జిల్లాలో ఇసుక ధరలు చుక్కలనంటాయి. గ తంతో పోలిస్తే నాలిగింతలు ధరలు పెరిగిపోయాయి. గతంలో ₹15వేలకు వచ్చే లారీ ఇసుక ఇప్పుడు ఏకంగా ₹50 నుంచి 60 వేలవరకు పలుకుతోంది. ఇసుక ధరల పెరుగుదల కారణం గా కనీసం 20 నుంచి 30 శాతం నిర్మాణవ్య యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భవన నిర్మాణాలు చేప బిల్డర్లు సైతం వెనకడుగువేస్తున్నట్లు తెలుస్తోంది.

నాణ్యమైన విద్య కలే..
జిల్లాలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్య అందడం కష్టంగా నే కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ అ యినప్పటికీ చాలాచోట్ల ఆదర్శ పాఠశాలల ఏ ర్పాటుకు స్థలాన్ని సేకరించలేక పోయారు. దీం తో విద్యా పరంగా వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు తొలివిడతలో 14 ఆదర్శ పాఠశాలలు మాత్రమే మంజూరయ్యాయి. దీంతో నాణ్యమై న విద్యకు జిల్లా విద్యార్థులు దూరం కానున్నా రు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ పథకం లో భాగంగా జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉ న్న మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పాఠశాలలు మండలంలోని అన్ని పాఠశాలలకు ఆదర్శంగా ఉండాలనేది ప్రధాన ఉద్దేశం.

6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం లో రాష్ట్రస్థాయి సిలబస్ అందించాలి. వీటితో పాటు సొంత భవనం, ప్రయోగశాల, లైబ్రరీ, వి శాల మైదానం ఏర్పాటు చేయాలి. మండలంలో ని పాఠశాల విద్యార్థులును ఆదర్శ పాఠశాలలకు తీసుకెళ్లి అందులో ఏర్పాటు చేసిన ప్రయోగశా ల, లైబ్రరీలపై అవగాహన కల్పిస్తారు. వీటి ఏ ర్పాటు కోసం స్థలం ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 52 మండలాల్లో అక్షరాస్యత శాతం త క్కువగా ఉందని నివేదించిన అధికారులు స్థల సేకరణ విషయంలో మాత్రం శ్రద్ధ చూపించలే దు. మండలాలు, పట్టణాల్లో వందలాది ఎకరా ల ప్రభుత్వ, అసైన్డ్ భూములను అక్రమార్కులు కాజేస్తుండగా, ఆదర్శ పాఠశాలలకు కేటాయించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయని ఏకరువు పెట్టారు. కేవలం 14 మండలాల్లోనే స్థల సేకరణ పూర్తి చేశారు.

మిగిలిన వాటికి స్థల సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ అది ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ఆదిలాబాద్, ఆ సిఫాబాద్, మంచిర్యాల, కోటపల్లి, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, బోథ్, కుంటాల, నా ర్నూర్, మందమర్రి, సిర్పూర్(టి), దండేపల్లి, జైనథ్ మండలాలకు ఆదర్శ పాఠశాలలు మం జూరు చేయడం పాటు భవన నిర్మాణాలు, వసతుల కల్పనకు నిధులు కేటాయించింది. ఇప్పటి కే మంజూరయిన ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన భవన నిర్మాణాల టెండర్లు ఖరారయ్యా యి. ఆదర్శ పాఠశాలలు మంజూరైన 14 మండలాల్లో వచ్చే జూన్ నుంచి విద్యాబోధన ప్రారం భం కావాల్సి ఉంది. భవనాలు పూర్తి చేసేంతవరకు అద్దె భవనాల్లో పాఠశాల నిర్వహణకు చర్య లు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపినప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.

సాధ్యమైనంత త్వరగా చేపడ్తాం..
ఈ విషయంలో డీఈవో అక్రముల్లాఖాన్‌ను ‘టీ న్యూస్’ వివరణ కోరగా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే భవనాలు నిర్మించాలని ఇదివరకే పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజే ష్ తివారి బిల్డర్లకు సూచించినప్పటికీ వారు స్పందించడంలేదన్నారు. సాధ్యమయినంత త్వ రగా నిర్మాణాలు చేప విద్యార్థులకు లా భంచేకూర్చుతామని చెప్పారు.


త్రిశంకు స్వర్గంలో మోడల్ స్కూళ్లు
-ఈ ఏడాది ప్రారంభం లేనట్లే?
-స్కూళ్ల చుట్టూ గింగిరాలు కొడుతున్న విద్యార్థులు
-ఇంతవరకు ఒక్క భవనం కూడా పూర్తికాని వైనం
-అద్దె భవనాలకు బడ్జెట్ కరువు
-టీచింగ్ పోస్టుల భర్తీపై వీడని చిక్కులు
-జూలై చివరికల్లా స్పష్టత వచ్చే అవకాశం

హైదరాబాద్, జూన్ 20 (టీ మీడియా):రాష్ట్రంలో మోడల్ స్కూళ్ల వ్యవహారం త్రిశంకు స్వర్గంలో పడింది. సరికొత్త మోడల్ స్కూళ్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రారంభించటంలో మాత్రం అలసత్వం వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుంచి అందుబాటులోకి రావాల్సిన మోడల్ స్కూళ్ల ప్రారంభంపై ఇప్పటివరకు విద్యాశాఖకే స్పష్టతలేదు. 2012-13 విద్యా సంవత్సరానికిగాను 355 మోడల్ స్కూళ్లు ప్రారంభించాల్సి ఉండగా భవనాలు పూర్తి కాలేదని భావించిన అధికారులు కేవలం 132 స్కూళ్లలో మాత్రమే 6,7,8, 11 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రవేశాల కోసం సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న ప్రారంభం కావాల్సి స్కూళ్లు ఇంతవరకు కాకపోవటంతో విద్యార్థులు వాటి చుట్టూ గింగిరాలు కొడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం అవుతాయా? లేదా? అని విద్యార్థులకు సమాచారం ఇచ్చేందుకు అధికారులకే స్పష్ఠత లేకపోవటంతో.. విద్యార్థుల తల్లిదంవూడులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. 355 మోడల్ స్కూల్ భవనాలకుగాను ఇంతవరకు ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తికాలేదు.

విద్యా సంవత్సరం ప్రారంభంకల్లా పూర్తిచేస్తామన్న భవనాలను గత మూడు నెలలుగా నెలకొన్న ఇసుక కొరత కారణంగా పూర్తి చేయలేకపోయామని ‘ఎడ్యకేషనల్ వెల్ఫేర్, ఇన్‌వూఫాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావటంతో భవన నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అడ్మిషన్లు చేపట్టాలనుకునే 132 స్కూళ్ల తరగతుల నిర్వహణ అద్దె భవనాల్లో ప్రారంభించాలని అధికారులు ప్రాథమికంగా భావించినా.. మోడల్ స్కూల్ నిధుల్లో అద్దె భవనాలకు బడ్జెట్ కేటాయింపులు లేవని అధికారులు చెబుతున్నారు. మోడల్ స్కూల్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు, మౌళిక వసతులు, ఫర్నీచర్ ఏర్పాటుకు ఒక్కో మోడల్ స్కూల్‌కు రూ.3.02 కోట్ల చొప్పున 355 స్కూళ్ళకు రూ.1072 కోట్లు కేటాయించారు. ఇందులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ కింద విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు మోడల్ స్కూల్ భవనాలు పూర్తయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ‘రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్’ (ఆర్‌ఎంఎస్‌ఏ) స్కూళ్లలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సెకండ్ షిఫ్ట్‌లో తరగతులు నిర్వహించాలని కూడా అధికారులు భావించారు. అయితే ఇప్పటికే అంతంత మాత్రంగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయటం సరికాదనే భావనతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇదిలావుంటే 6,7,8 తరగతుల ప్రారంభం కాస్త ఆలస్యంగా ప్రారంభించినా పెద్దగా నష్టం ఏమీ ఉండదు.

కానీ ఇంటర్ మొదటి సంవత్సరానికి మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంటర్ తరగతులు ప్రారంభమై 20 రోజులవడంతో మోడల్ స్కూళ్ల నిర్వహణ ఏ విధంగా చేపట్టాలనే అంశం అధికారులకు అంతుబట్టకుండా ఉంది. దీనికితోడు విద్యా శాఖ మంత్రి మొన్నటివరకు ఉప ఎన్నికల్లో బీజీ ఉండగా.. తాజాగా విదేశీ పర్యటనలు చేస్తూ శాఖను పట్టించుకోవటం మానేశారు. దీంతో మోడల్ స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభిస్తారా? లేదా? అనే విషయాన్ని మరో 10 రోజులైతేగాని తేల్చలేమంటున్నారు అధికారులు. మోడల్ స్కూళ్లలో 7200 టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారులు రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు విడుదల చేసేందుకు ప్రక్రియ చేపట్టారు. అయితే నియామకాలకు సంబంధించి ఇంతవరకు న్యాయపరమైన చిక్కులు వీడలేదు. జూలై నెల చివర్లోగాని నియామకాలపై స్పష్టత వచ్చే అవకాశంలేదని అధికారులు అంటున్నారు. కాగా, ఇన్ని అవాంతరాల మధ్య ప్రాజెక్టును ప్రారంభిస్తే మరో ‘సక్సెస్ స్కూళ్ళ’లాగా ఫెయిలవుతుందా? అని అధికారులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తేనే ప్రాజెక్టు సక్సెస్ అవుతుందని వారు భావిస్తున్నారు.






7 comments:

  1. Hello Laxman,

    GOOD TO VISIT YOUR SITE.

    ReplyDelete
  2. Hello sir,


    I am Raju, PGT English aspirant, with 58 marks. I want to know about deputation in recruitment process............can you please furnish some information......

    ReplyDelete
    Replies
    1. Refer to Questions 3&4 in FAQs to get your doubt clarified.

      Delete
  3. My Gosh Aspirants!!!!

    What the heck is going on here? FEBRUARY—– Gone,……….. MARCH–Gone in the wind!!!!!!!!!!!!!!!! And now Principals APRIL…………….. and MAY for PGT-TGT . ??????????????????

    come on guys What the **** is going on here with the government????????????????

    ONE THING I CAN SAY….. HAD OUR ASPIRANTS BEEN LIKE TELUGU MEDIUM CANDIDATES…… DAMN!!!!!!!!!!!!!!!!!! WE WOULD HAVE BEEN RECRUITED LAST YEAR ONLY DUDES!!!!!!!

    WE wrote our exam in MAY 2012 and Damn i prepared not even for a month….. as if these ********* fellows were recruiting us so early. But what’s happening ????? they would have told us before that the notification is for ******* sake and the recruitment is for……………………
    no more words to say.
    So please lets be united or else…………..

    one thing I found we are not as clever and and as smart as telugu medium candidates!!!!!!!!!!!!! This is PAKKA!!!!!

    SO WHAT IS OUR FATE???????????????????????

    ReplyDelete
  4. ravi, in apms notofication english medium is asked only from school to pg.no specification for bed medium.does it mean just possession of bed is enough and bed medium is not considered.kindly reply

    ReplyDelete
    Replies
    1. The condition of EM Is only for SSC-PG. The medium of B.Ed and its percentage is not a point at all.

      Delete
  5. UPDATE ON PRINCIPALS RECRUITMENT: finally the list of shortlisted candidates for verification of certificates is published in the portal www.apms.cgg.gov.in. GOOD LUCK TO ALL THOSE WHO MADE IT TO THE LIST.

    ReplyDelete